Odisha: పరీక్షా కేంద్రంగా మారిన ఎయిర్ పోర్ట్ రన్వే.. 187 పోస్టులకు 8,000 మంది పోటీ
- పరీక్షా కేంద్రంగా మారిన ఎయిర్ పోర్ట్ రన్వే
- 187 పోస్టులకు 8,000 మంది పోటీ
- ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఈ ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిర్వహిస్తుంటారన్న విషయం తెలిసిందే. కానీ ఆ రాష్ట్రంలో దీనికి భిన్నంగా ఎయిర్ పోర్ట్ రన్ వే పై పరీక్ష నిర్వహించారు. రన్ వేను పరీక్షా కేంద్రంగా మార్చారు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. హోంగార్డ్ నియామక పరీక్ష రాయడానికి వచ్చిన ఎనిమిది వేల మంది అభ్యర్థులను ఎయిర్స్ట్రిప్పై కూర్చోబెట్టాల్సి వచ్చింది.
187 హోమ్ గార్డ్ పోస్టులకు కనీస అర్హత ఐదవ తరగతి ఉత్తీర్ణత. అయినప్పటికీ, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు సహా 8,000 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. తెల్లవారుజాము నుండే, పరీక్ష జరిగిన జమదర్పాలి ఎయిర్స్ట్రిప్ వద్ద పెద్ద సంఖ్యలో అభ్యర్థులు చేరుకున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం అధికారులకు అనేక లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చింది. సాంప్రదాయ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు భావించారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
పరిస్థితిని అదుపులో ఉంచి పరీక్ష సజావుగా జరిగేలా చూసేందుకు, పరీక్ష నిర్వహణ యంత్రాంగం జమదర్పాలి ఎయిర్స్ట్రిప్ను పరీక్షా వేదికగా ఎంచుకుంది. అభ్యర్థులను ఎయిర్స్ట్రిప్లో ఓపెన్ స్కై కింద
కూర్చోబెట్టారు. అసాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ, పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థులు అంతటా క్రమశిక్షణను పాటించారు. ఈ పరీక్ష డిసెంబర్ 16న సంబల్పూర్లో జరిగింది. ఈ పరీక్షకు దాదాపు 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, పరీక్ష రోజున దాదాపు 8,000 మంది హాజరయ్యారని సంబల్పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) తెలిపారు. 8,000 మంది అభ్యర్థులకు ఒకే చోట పరీక్ష నిర్వహించాలంటే ఇరవై పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సంబల్పూర్లో ప్రతి ఆదివారం అనేక పరీక్షలు జరుగుతాయి, ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించడం కష్టం అవుతుందని అన్నారు. అందుకే ఎయిర్ పోర్ట్ రన్ వేపై పరీక్ష నిర్వహించామని తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!