Tamilnadu : తమిళనాడులో విషాదం.. ట్రోల్స్ తట్టుకోలేక ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం క్షణాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా కొందరికి ఉపకారి కాగా మరికొందరి అపకారిగా మారుతోంది. కొందరు సోషల్ మీడియా కారణంగా ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు. మూడు వారాల కిందట చెన్నైలో ఒక చిన్నారి అపార్ట్మెంట్లో ఉన్న షెడ్పై పడిపోయింది. ఆ చిన్నారి షెడ్ చివర్లో చాలా సమయం అలాగే ఆగిపోయింది. గమనించిన ఇరుగుపొరుగు వెంటనే స్పందించారు. చాలా కష్టపడి ఆ చిన్నారిని రక్షించారు. కిటికీ లోనుంచి ఇద్దరు వ్యక్తులు నిలబడి షెడ్పై ఉన్న చిన్నారిని కాపాడారు. ఇక మరోవైపు ఆ పాప ఎక్కడ కిందపడిపోతుందన్న భయంతో కాపాడేందుకు స్థానికులు దుప్పట్లు, బెడ్షీట్లను పరిచి రెడీగా ఉన్నారు. చివరకు ఆ చిన్నారిని కిటికీలో నుంచి ఇద్దరు వ్యక్తులు కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Also:NTR : ఎన్టీఆర్ బర్త్ డే.. జపాన్ లేడీ ఫ్యాన్స్ మాస్ సెలెబ్రేషన్స్..
Also Read
ఈ సంఘటన చెన్నై అవాడీలోని ఓ అపార్ట్మెంట్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎలాగోలా ఆ చిన్నారిని కాపాడిన వ్యక్తులను మెచ్చుకున్నారు. ఇదే సమయంలో ఎనిమిది నెలల చిన్నారిని నిర్లక్ష్యంగా వదిలేసిన తల్లిని ఆడిపోసుకున్నారు. పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలంటూ బండబూతులు తిట్టారు. తల్లి నిర్లక్ష్యం కారణంగానే పసికందు ఈ ప్రమాదంలో పడిందంటూ ఆరోపించారు. ఇక స్థానికులు కొందరు స్పందించి.. ఇది అనుకోకుండా జరిగిందనీ.. తల్లి తప్పేమీ లేదని చెప్పినా కొందరు ట్రోలర్స్ ఊరుకోలేదు. పసికందు తల్లి రమ్యను ట్రోల్ చేస్తూ భయంకరమైన కామెంట్స్ చేశారు. తల్లి పాపను చూసుకోవడంలో ఫెయిల్ అయిందంటూ తిట్టిపోశారు.
Read Also:Tirupati: ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా చూస్తాం..
కాగా.. ఇటీవల రమ్య తన పాపను తీసుకుని కరమదాయ్లోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఆదివారం ఆమె తల్లిదండ్రుల ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఇక వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు ప్రకటించారు. తాజాగా ఈ సంఘటనపై సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. నటుడు ప్రశాంత్ రంగస్వామిపై ఆమె ఆగ్రహం వ్యక్తం అయ్యారు. రమ్యను వీడియో వైరల్ అయిన సమయంలో తిట్టడం వల్లే ఆత్మహత్య చేసుకుందంటూ ఆరోపించారు. ప్రశాంత్ లాంటి వ్యక్తులు.. ఈ వీడియో కింద ఎవరైతే తల్లిదండ్రులను అవమానించారో.. వారంతా ఇప్పుడు పండగ చేసుకోవచ్చని ట్విటర్ వేదికగా ఆమె రాసుకొచ్చారు.
அந்த குழந்தையை பெற்றவர்களுக்கு – உங்களுக்கு கொழந்த ஒரு கேடாடா ? pic.twitter.com/0FUskMECMf
— Prashanth Rangaswamy (@itisprashanth) April 28, 2024
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!