ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ నుంచి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఈరోజు తెల్లవారుజామున గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 23 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ సంఘటన ప్రాగ్కు తూర్పున 100 కిలోమీటర్లు (62 మైళ్ళు) దూరంలో ఉన్న పార్దుబిస్ నగరంలో జరిగిందని ఆ దేశ మంత్రి విట్ రాకుసన్ తెలిపారు. ప్యాసింజర్ రైలు ప్రైవేట్ రెజియోజెట్ కంపెనీకి చెందినదని రకుసన్ చెప్పారు. దీంతో తూర్పు భాగం గుండా ఒక ప్రధాన ట్రాక్ మూసివేయవలసి వచ్చిందన్నారు.
Read Also: Aranmanai 4 OTT: ఓటీటీలో తమన్నా, రాశీఖన్నా ‘బాక్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కాగా, ఈ రైలులో 300 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.. వీరిలో చాలా మంది విదేశీయులు.. ప్రైవేట్ రెజియోజెట్ కంపెనీ నిర్వహించే ఈ రైలు స్లోవేకియా సరిహద్దుకు దగ్గరగా ఉన్న పశ్చిమ ఉక్రేనియన్ నగరమైన చాప్కు వెళ్తుండగా.. పార్దుబిస్ మెయిన్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెక్ రిపబ్లిక్ దేశ రవాణా శాఖ మంత్రి మార్టిన్ కుప్కా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగుతుందన్నారు. ఇక, గూడ్స్ రైలు కాల్షియం కార్బైడ్ను తీసుకువెళుతుందని స్థానిక అగ్నిమాపక శాఖ ప్రతినిధి వెందుల హోరకోవా పేర్కొన్నారు. ఈ దుర్ఘటనను పెను విషాదంగా అభివర్ణించిన ఆయన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.