Delhi: రాజ్యసభ ఎంపీలపై ఆసక్తికరంగా ఏడీఆర్ నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఎంపీలపై ఆసక్తికరమైన ఏడీఆర్ నివేదిక వెలువడింది. రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల్లో (Rajya Sabha MPs) 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్నట్లు ఎన్నికల హక్కుల సంఘం ఏడీఆర్(ADR) నివేదిక తెలిపింది. 225 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల డేటాను విశ్లేషించిన తర్వాత ఏడీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సిట్టింగ్ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.19,602గా ఉన్నాయని తెలిపింది.
ఇద్దరు ఎంపీలపై మాత్రం హత్య, నలుగురు ఎంపీలపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. 225 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో 75 (33 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 40 (18 శాతం) మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పారు. క్రిమినల్ కేసులున్న వారిలో బీజేపీ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన 28 మంది ఎంపీలలో 50 శాతం మందిపై నేరారోపణలు ఉన్నాయి.
Also Read
- Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 13 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు (38 శాతం), ఆర్జేడీ నుంచి ఆరుగురిలో నలుగురు (67 శాతం), సీపీఐ(ఎం) నుంచి ఐదుగురు ఎంపీల్లో నలుగురు (80 శాతం) నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారు. ఆప్కి చెందిన 10 మంది ఎంపీలలో 30 శాతం మంది, వైఎస్సార్సీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులలో నలుగురు (36 శాతం), డీఎంకే 10 మంది ఎంపీల్లో ఇద్దరు (20 శాతం) తమపై క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్లో సమర్పించారు.
ఇక ఎంపీల నేర చరిత్రతో పాటు రాజ్యసభ సభ్యుల ఆస్తులపై కూడా వెల్లడించింది. ఒక్కో ఎంపీకి సగటున రూ.87.12 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. 90 మంది సభ్యులున్న బీజేపీకి చెందిన 9 మంది, కాంగ్రెస్ 4 మంది, వైసీపీ అయిదుగురు, ఆప్, బీఆర్ఎస్, ఆర్జేడీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు రూ.100 కోట్లకుపైనే ఆస్తులు కలిగి ఉన్నారు. పార్టీల వారీగా బీజేపీ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.3,360 కోట్లు, కాంగ్రెస్ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.1,139 కోట్లు, వైఎస్సార్సీపీ (YSRCP) ఎంపీల ఆస్తులు రూ.3,934 కోట్లు, బీఆర్ఎస్ (BRS) ఎంపీల ఆస్తులు రూ.5,534 కోట్లు, ఆప్ ఎంపీల ఆస్తులు రూ.1,148 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఒక స్థానం, జమ్ము కశ్మీర్ నుంచి నాలుగు ఎంపీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు ఎంపీల అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడంతో ఏడీఆర్ వారి డేటాను విశ్లేషించలేదు.
తాజావార్తలు
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్లో అసలైన సూపర్మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!