Site icon NTV Telugu

Tanker Accident: హైవేపై ట్యాంకర్‌ బీభత్సం.. 40కి పైగా వాహనాలు ధ్వంసం

Accident

Accident

Tanker Accident: మహారాష్ట్రలోని పుణెలో ఆయిల్‌ ట్యాంకర్‌ బీభత్సం సృష్టించింది. ఆదివారం పుణెలోని నవాలే వంతెన వద్ద అతివేగంతో లారీ దూసుకురావడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. పలు వాహనాలను ట్యాంకర్ ఢీకొనడంతో కనీసం 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 48 వాహనాలు కుప్పకూలిపోయాయని పూణే అగ్నిమాపక దళ అధికారి తెలిపారు. పుణె ఫైర్‌ బ్రిగేడ్‌, పుణె మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను హుటాహుటిన దవాఖానకు తరలించాయి.

Uttarpradesh Crime: శ్రద్ధా హత్య తరహాలో మరో హత్య.. దేహాన్ని 6 ముక్కలు చేసి..

స్థానిక మీడియా ప్రకారం.. ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ట్యాంకర్‌ పలు వాహనాలను ఢీకొట్టింది. రాత్రి 9 గంటలకు జరిగిన ప్రమాదంలో ఆయిల్ రోడ్డుపై చిందిన కారణంగా వాహనాలు జారడం వల్ల కూడా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ముంబైకి వెళ్లే రహదారిపై ట్రాఫిక్ స్తంభించి 2 కి.మీ పొడవునా జామ్‌లు ఏర్పడినట్లు నివేదించబడింది. గత కొన్ని రోజులుగా నావెల్ బ్రిడ్జ్ ప్రమాదాల హాట్ స్పాట్‌గా మారుతోంది. శుక్రవారం ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వంతెన సమీపంలో వేగంగా వస్తున్న కారు ఢీకొని మహిళ మృతి చెందింది.

 

 

https://twitter.com/sangram_0277/status/1594378686299791362?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1594378686299791362%7Ctwgr%5E44198e958c093b9e3ccdd320846c924d1bb775e7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Findia-news%2F48-vehicle-pile-up-at-bridge-on-pune-bengaluru-highway-rescue-teams-at-site-news-agency-ani-3538392

Exit mobile version