Planes Collide: గాలిలో ఢీకొన్న సైనిక విమానాలు.. ఇద్దరు పైలట్లు మృతి

Planes Collide

Planes Collide

Planes Collide: ఇటలీలోని రోమ్‌కు వాయువ్య దిశలో శిక్షణా విన్యాసాల సందర్భంగా ఇటాలియన్ వైమానిక దళానికి చెందిన రెండు విమానాలు గాలిలో ఢీకొన్నాయి. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్‌లు మరణించారని ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని చెప్పారు. ఇద్దరు పైలట్లు U-208 శిక్షణా విమానాల్లో ఉన్నారు. వారు శిక్షణా మిషన్‌లో పాల్గొంటున్నారని వైమానిక దళ పత్రికా ప్రకటన తెలిపింది. ఢీకొనడానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు.

Read Also: Explosion: ఢాకాలో భారీ పేలుడు.. 14 మంది దుర్మరణం, 100 మందికి గాయాలు

×
×
Ad

గైడోనియా సమీపంలో శిక్షణ విమానాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వైమానిక దళ పైలట్ల మరణాల గురించి విన్నప్పుడు తాము చాలా బాధపడ్డామని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వాపోయారు. పైలట్ల కుటుంబాలకు, వైమానిక దళ సభ్యులకు ప్రధాని సంతాపం తెలిపారు. యూ-208 అనేది ఒక తేలికపాటి, ఒకే-ఇంజిన్ గల విమానం. ఇది నలుగురు ప్రయాణీకులు, పైలట్‌తో పాటు 285 కిమీ (177 mph) గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.