Site icon NTV Telugu

RBI: జమ్మూ కాశ్మీర్‌లో 17 లక్షల బినామీ ఖాతాలు.. అకౌంట్లలో రూ.465 కోట్లు

Rbi

Rbi

జమ్మూ కాశ్మీర్‌లో 17.20 లక్షలకు పైగా బినామీ (అన్‌క్లెయిమ్డ్) బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిలో మొత్తం రూ.465.79 కోట్లు క్లెయిమ్డ్ లేకుండా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఖాతాల నిజమైన యజమానులను సంప్రదించి, వీలైనంత త్వరగా మొత్తాన్ని తిరిగి ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. జమ్మూ జిల్లాలో మాత్రమే 2,94,676 బినామీ ఖాతాలు ఉన్నాయని, వాటిలో రూ.107.27 కోట్లు జమ అయ్యాయని ఆర్‌బిఐ ప్రాంతీయ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఆజాద్ తెలిపారు.

Also Read:Mystery: లవ్ ఎఫైర్, బ్లాక్‌మెయిల్.. వీడిన తల లేని మహిళ మృతదేహం మిస్టరీ..

బ్యాంకులు అటువంటి ఖాతాదారులను లేదా వారి వారసులను వెతికి, ఆ మొత్తాన్ని త్వరగా చెల్లించాలని ఆయన అన్నారు. ఈ పథకం కింద, బినామీ ఖాతాలను యాక్టివ్ చేసినందుకు లేదా మొత్తాన్ని తిరిగి ఇచ్చినందుకు బ్యాంకులకు బ్యాలెన్స్‌లో 7.5% వరకు లేదా గరిష్టంగా రూ. 25,000 వరకు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం సెప్టెంబర్ 30, 2026 వరకు అమలులో ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల స్థాయి బ్యాంకర్ల కమిటీ అవగాహన, పరిష్కార శిబిరాలను నిర్వహించింది. ఇక్కడ ప్రజలకు వారి క్లెయిమ్ చేయని బ్యాంకు ఖాతాలు, బీమా, పెన్షన్ నిధులు, మ్యూచువల్ ఫండ్‌లు, డివిడెండ్ల గురించి సమాచారం అందించి, ధృవీకరించారు.

Exit mobile version