Train Derailed: పెను ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు
- పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
- ఒకరు మృతి, 20 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం, ఒక ప్యాసింజర్ రైలులోని 4 బోగీలు అకస్మాత్తుగా పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో, ఒక ప్రయాణీకుడు మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఈ ప్రమాదం జరిగింది. లోధ్రాన్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులతో బయలుదేరిన ప్యాసింజర్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఈ రైలు పెషావర్ నుంచి కరాచీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
Also Read:Tollywood Bundh : బంద్ పై మెగా పంచాయితీ.. తీర్పు ఆమోదయోగ్యంగా ఉంటుందా?
Also Read
సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పట్టాలు తప్పిన బోగీల్లో ఉన్న ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడని వారిని ఆసుపత్రికి తరలించారు. లోధ్రాన్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లుబ్నా నజీర్ ప్రకారం, మరో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ప్రమాదం తర్వాత, ఈ మార్గం కొన్ని గంటల పాటు మూసివేశారు. ట్రాక్ పునరుద్దరణ తర్వాత రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు.
తాజావార్తలు
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!