Wife Kills Husband: బావతో వివాహేతర సంబంధం, భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి హత్య..
- ఢిల్లీ ద్వారకా కేసులో సంచలన విషయాలు..
- భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసిన భార్య..
- బావతో వివాహేతర సంబంధం పెట్టుకుని కుట్రతో హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: భర్తలను చంపుతున్న భార్యల కేసుల్లో మరో పేరు చేరింది. ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో 35 ఏళ్ల వ్యక్తిని అతడి భార్య, లవర్ కలిసి కుట్రతో హత్య చేశారు. బాధితుడు కరణ్ దేవ్ గత ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే, భార్య సుస్మితా దేవ్, ఆమె బావ రాహుల్ దేవ్ ఇద్దరు కలిసి కుట్ర పన్ని హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. బాధితుడు కరణ్ దేవ్ కరెంట్ షాక్కు గురై మరణించాడని కట్టు కథ అల్లింది. చివరకు కరణ్ దేవ్ సోదరుడి అనుమానంతో, మృతదేహానికి పోస్టుమార్టం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Chhangur Baba: ఆర్ఎస్ఎస్ ముసుగులో ‘‘ఛంగూర్ బాబా’’ అరాచకాలు, మోడీ పేరు మిస్ యూజ్..
Also Read
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
ముందుగా సుస్మితా, రాహుల్ దేశ్ ,రాహుల్ తండ్రి పోస్టుమార్టాన్ని వ్యతిరేకించారు. దీంతో బాధితుడి కుటుంబీకుల అనుమానాలు ఎక్కువ అయ్యాయి. బాధితుడి వయసును దృష్టిలో పెట్టుకుని వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కరణ్ దేవ్ను ఎలా చంపాలని ఇద్దరు చర్చించుకున్న చాట్ ఇప్పుడు వైరల్గా మారింది. అతడికి మత్తు మందు ఇచ్చి, విద్యుత్ షాక్తో హత్య చేయాలని భయంకరమైన కుట్రకు ప్లాన్ రూపొందించినట్లు తేలింది.
భార్య డిన్నర్ సమయంలో అతడికి 15 నిద్ర మాత్రలు ఇచ్చి, అతను అపస్మారక స్థితిలోకి చేరుకునే వరకు వేచి ఉన్నారు. నిద్ర మాత్రలు వేసిన తర్వాత ఎంత సేపు తర్వాత మరణిస్తాడనే విషయాలనున గూగుల్లో సెర్చ్ చేసినట్లు తేలింది. బాధితుడు స్పృహ కోల్పోయి, ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కరెంట్ షాక్ ఇవ్వాలని ఇద్దరూ చర్చించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు మరణించాడని చిత్రీకరించేందుకు ఇద్దరూ బాధితుడికి విద్యుత్ షాక్ ఇచ్చారు. పోలీసులు నిందితురాలైన భార్యను అరెస్ట్ చేశారు. తన బావతో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది.
తాజావార్తలు
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?