“దళపతి”గా సుపరిచితుడైన సి. జోసెఫ్ విజయ్, రాష్ట్రంలో ఒక ప్రధాన రాజకీయ మార్పుకు నాంది పలుకుతూ, ఆదివారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్తో గవర్నర్ అర్లేకర్ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. రాహుల్ గాంధీ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
రోజుల తరబడి జరిగిన తీవ్రమైన రాజకీయ చర్చలు, పలు పార్టీల మద్దతుతో అసెంబ్లీలో మెజారిటీ మార్కును దాటిన అనంతరం, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, 1967 తర్వాత డీఎంకే లేదా ఏఐఏడీఎంకే పార్టీలలో దేనికీ చెందని మొట్టమొదటి తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ నిలిచారు, తద్వారా దశాబ్దాలుగా ఆ రెండు ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరపడింది.
