Site icon NTV Telugu

Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్‌ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ

Modi

Modi

Cabinet Meet: ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై స్పష్టత వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ నుంచి మోడీ కేబినెట్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రి పదవుల రేసులో పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్‌కు కేంద్ర కేబినెట్‌లో చేరేందుకు నిరాకరిస్తే.. రాష్ట్రం నుంచి ఎవరికి చోటు కల్పిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్‌, ఆదిలాబాద్‌ నుంచి సోయం బాపురావు, యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన కె.లక్ష్మణ్‌లు బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. దీంతో వీరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేదు. వీరిలో కె.లక్ష్మణ్ ఇప్పటికే పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు మంగళవారం ఎంపీ సోయం బాపురా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయన్ను ఢిల్లీకి పిలిపించారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ జరిగితే తెలంగాణకు చెందిన ఇద్దరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నా ఎలాంటి స్పందనా లేదు.

Read also: Bandi Sanjay: మీ అందరికి అభినందనలు.. బండి ట్విట్‌ వైరల్

మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించడం పట్ల బండి సంజయ్ సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం నియమించినట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ఊహాగానాల దృష్ట్యా బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. లేదంటే పార్టీ జాతీయ కార్యవర్గంలో కూడా చోటు కల్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై బండి సంజయ్ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను సాధారణ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని సంజయ్ బీజేపీ నాయకత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన బండి సంజయ్.. ఆ తర్వాత మీడియా కంట పడకుండా వెళ్లిపోయారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించడంపై ఆయన ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా తన పనితీరును బీజేపీ నేతలు పలు సందర్భాల్లో మెచ్చుకున్నారనే భావనలో బండి సంజయ్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ అప్పగించిన ఇతర బాధ్యతలను స్వీకరించేందుకు బండి సంజయ్ నిరాకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Rangoli: పాతబస్తీలో విషాదం.. ప్రాణం తీసిన ‘ముగ్గు’ వివాదం

Exit mobile version