TVK Chief Vijay: తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ నిన్న ( సెప్టెంబర్ 27న ) కరూర్లో రోడ్షో నిర్వహించారు. ఈ రోడ్ షో సందర్భంగా ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 39 మందికి పైగా మృతి చెందగా.. 111 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
Read Also: Nep vs WI: పరువంతపాయె.. రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై పసికూన గెలుపు
ఇక, కరూర్ తొక్కిసలాటపై టీవీకే అధినేత విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ తొక్కిసలాట ఘటనతో నా హృదయం ముక్కలైంది అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలకు టీవీకే అధినేత విజయ్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉంటామని టీవీకే అధినేత విజయ్ పేర్కొన్నారు.
என் நெஞ்சில் குடியிருக்கும் அனைவருக்கும் வணக்கம்.
கற்பனைக்கும் எட்டாத வகையில், கரூரில் நேற்று நிகழ்ந்ததை நினைத்து, இதயமும் மனதும் மிகமிகக் கனத்துப் போயிருக்கும் சூழல். நம் உறவுகளை இழந்து தவிக்கும் பெருந்துயர்மிகு மனநிலையில், என் மனம் படுகிற வேதனையை எப்படிச் சொல்வதென்றே…
— TVK Vijay (@TVKVijayHQ) September 28, 2025
