NTV Telugu Site icon

Indra Sena Reddy: త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలు

Indrasenareddynallu

Indrasenareddynallu

త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డికి మిజోరం గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబు కొద్దిరోజులుగా సెలవులో ఉన్నారు. ఆయన అస్వస్థతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో మిజోరం గవర్నర్‌ బాధ్యతలను అదనంగా ఇంద్రసేనారెడ్డికి అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కంభంపాటి హరిబాబు జూలై 2021లో మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి: Israel video released: వామ్మో.. ఈ వీడియో చూస్తే హిజ్బుల్లాకు నిద్రపట్టదేమో..!

మిజోరం గవర్నర్‌గా విధులు నిర్వర్తించడానికి తన స్వంత విధులతో పాటుగా త్రిపుర గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డిని నియమించడం పట్ల భారత రాష్ట్రపతి సంతోషిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Israel-Lebanon: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ విధ్వంసం.. కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ హతం..!