Chinese Manja: పండగ రోజు విషాదం.. మాంజా నుంచి తప్పించుకునే ప్రయత్నం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి
- మకర సంక్రాంతి రోజున సూరత్లో విషాదం..
- మాంజాను తప్పించబోయి ప్రమాదం..
- ఫ్లైఓవర్ పై నుంచి కిందపడిపోయిన బైక్..
- ఓకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి..
Chinese Manja: చైనా మాంజాలు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీశాయి.. బైక్లపై వెళ్తున్నవారికి మాంజా అడ్డు పడడం.. గొంతుకు తాకడం.. గొంతు తెగి ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు.. తాజాగా గుజరాత్ రాష్ట్రం సూరత్లో సంక్రాంతి రోజున జరిగిన విషాద ఘటన స్థానికులను కలచివేసింది. గాలిపటాలకు ఉపయోగించే మాంజా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మోటార్సైకిల్ అదుపు తప్పి ఫ్లైఓవర్పై నుంచి కిందపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జనవరి 14న సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య జరిగింది. సూరత్లోని వాడే రోడ్–అడాజన్ను కలిపే చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ (జిలానీ బ్రిడ్జ్)పై రెహాన్ రహీమ్ షేక్ (35) తన భార్య రెహానా, పదేళ్ల కుమార్తె ఆయేషాతో కలిసి బైక్పై వెళ్తుండగా అకస్మాత్తుగా గాలిపటాల తీగ వారి ముందుకు వచ్చింది. తీగను తప్పించేందుకు రెహాన్ చేతితో దాన్ని తొలగించడానికి ప్రయత్నించగా, బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టింది. ఆ ప్రభావంతో బైక్తో సహా ముగ్గురు ఫ్లైఓవర్పై నుంచి సుమారు 70 అడుగుల కింద రోడ్డుపై పడిపోయారు. కింద నిలిపి ఉన్న ఒక ఆటోరిక్షాపై వారు పడటంతో ఆ వాహనం పూర్తిగా దెబ్బతింది.
Also Read
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఈ ప్రమాదంలో రెహాన్ మరియు అతని కుమార్తె ఆయేషా అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలపాలైన అతని భార్య రెహానాను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. పశ్చిమ బెంగాల్కు చెందిన రెహాన్ సూరత్లోని సయ్యద్పురా ప్రాంతంలో నివసిస్తూ నగల తయారీ పనిలో ఉన్నాడు. అతడే కుటుంబానికి ఏకైక ఆదాయ మార్గం.. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. అందులో గాలిపటాల తీగను తప్పించుకునే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పి ఫ్లైఓవర్పై నుంచి పడిపోయిన భయంకరమైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రత్యక్ష సాక్షి అయిన ఆటో డ్రైవర్ ఇక్బాల్ భాయ్ మాట్లాడుతూ.. తాను రిక్షాలో కూర్చొని ఉండగా పైనుంచి ఒక్కసారిగా ముగ్గురు వ్యక్తులు రిక్షాపై పడిపోయారని తెలిపారు. ఈ ఘటనతో తాను కూడా స్వల్పంగా గాయపడినట్లు చెప్పారు. మృతుడి సోదరుడు షేక్ ఫర్హాన్ మాట్లాడుతూ, గాలిపటాల తీగే ఈ దుర్ఘటనకు కారణమని పేర్కొన్నారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపి, ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబం మొత్తం మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
-
Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
-
PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!