Chinese Manja: పండగ రోజు విషాదం.. మాంజా నుంచి తప్పించుకునే ప్రయత్నం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి
- మకర సంక్రాంతి రోజున సూరత్లో విషాదం..
- మాంజాను తప్పించబోయి ప్రమాదం..
- ఫ్లైఓవర్ పై నుంచి కిందపడిపోయిన బైక్..
- ఓకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese Manja: చైనా మాంజాలు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీశాయి.. బైక్లపై వెళ్తున్నవారికి మాంజా అడ్డు పడడం.. గొంతుకు తాకడం.. గొంతు తెగి ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్నారు.. తాజాగా గుజరాత్ రాష్ట్రం సూరత్లో సంక్రాంతి రోజున జరిగిన విషాద ఘటన స్థానికులను కలచివేసింది. గాలిపటాలకు ఉపయోగించే మాంజా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మోటార్సైకిల్ అదుపు తప్పి ఫ్లైఓవర్పై నుంచి కిందపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జనవరి 14న సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య జరిగింది. సూరత్లోని వాడే రోడ్–అడాజన్ను కలిపే చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ (జిలానీ బ్రిడ్జ్)పై రెహాన్ రహీమ్ షేక్ (35) తన భార్య రెహానా, పదేళ్ల కుమార్తె ఆయేషాతో కలిసి బైక్పై వెళ్తుండగా అకస్మాత్తుగా గాలిపటాల తీగ వారి ముందుకు వచ్చింది. తీగను తప్పించేందుకు రెహాన్ చేతితో దాన్ని తొలగించడానికి ప్రయత్నించగా, బైక్ నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టింది. ఆ ప్రభావంతో బైక్తో సహా ముగ్గురు ఫ్లైఓవర్పై నుంచి సుమారు 70 అడుగుల కింద రోడ్డుపై పడిపోయారు. కింద నిలిపి ఉన్న ఒక ఆటోరిక్షాపై వారు పడటంతో ఆ వాహనం పూర్తిగా దెబ్బతింది.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
ఈ ప్రమాదంలో రెహాన్ మరియు అతని కుమార్తె ఆయేషా అక్కడికక్కడే మరణించారు. తీవ్ర గాయాలపాలైన అతని భార్య రెహానాను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. పశ్చిమ బెంగాల్కు చెందిన రెహాన్ సూరత్లోని సయ్యద్పురా ప్రాంతంలో నివసిస్తూ నగల తయారీ పనిలో ఉన్నాడు. అతడే కుటుంబానికి ఏకైక ఆదాయ మార్గం.. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. అందులో గాలిపటాల తీగను తప్పించుకునే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పి ఫ్లైఓవర్పై నుంచి పడిపోయిన భయంకరమైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రత్యక్ష సాక్షి అయిన ఆటో డ్రైవర్ ఇక్బాల్ భాయ్ మాట్లాడుతూ.. తాను రిక్షాలో కూర్చొని ఉండగా పైనుంచి ఒక్కసారిగా ముగ్గురు వ్యక్తులు రిక్షాపై పడిపోయారని తెలిపారు. ఈ ఘటనతో తాను కూడా స్వల్పంగా గాయపడినట్లు చెప్పారు. మృతుడి సోదరుడు షేక్ ఫర్హాన్ మాట్లాడుతూ, గాలిపటాల తీగే ఈ దుర్ఘటనకు కారణమని పేర్కొన్నారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపి, ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబం మొత్తం మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!