మన దేశంలో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 11,451 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 266 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 13,204 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,42,826 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య 3,37,63,104 కు పెరగగా.. కోవిడ్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 4,61,057 కు చేరింది.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,84,096 టీకా డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 1,08,47,23,042 డోసులు వేసినట్టు తెలిపింది కేంద్రం.
ఇండియాలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే..?
