ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు.. భారత్లో 1991 కంటే గడ్డు పరిస్థితులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రత్లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టున ఘనత అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్లకు దక్కింది.. అయితే, అప్పట్లో ఆర్థిక సంస్కరణలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. 1991 నాటికి భారత్లో ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది.. ఉత్పత్తి, ఖర్చు, వినియోగం ఇలా అన్నీ ప్రభుత్వమే చూసుకునేది.. అందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తూ వచ్చారు.. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ జులై 24, 1991న బడ్జెట్ను ప్రవేశపెట్టారు.. ఇక, ఆర్థిక సంస్కరణలు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్.. దేశ ఆర్థిక వ్యవస్థ 1991లో ఎదుర్కొన్న సంక్షోభం కంటే గడ్డు పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలందరికీ ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలంటే.. ప్రభుత్వం తన ప్రాధమ్యాలను పునర్ సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
గత 30ఏళ్లలో వివిధ ప్రభుత్వాల కృషి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోగమించిందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు మన్మోహన్ సింగ్.. ఆర్థిక సంస్కరణల ఫలితంగా సుమారు 30 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారన్న ఆయన.. యువతకు కోట్ల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. సంస్కరణల ద్వారా లభించిన వ్యాపారావకాశాలను అందిపుచ్చుకుని భారతీయ కంపెనీలు వివిధ రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలుగా ఎదిగాయన్నారు మన్మోహన్.. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయయన్నారు.. మరోవైపు.. కరోనా మహమ్మారితో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం.. వారి జీవనోపాధికి గండి పడడం బాధాకరమన్న ఆయన.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే.. విద్య, వైద్య రంగాల్లో దేశం ఇంకా చాలా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Also Read
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!