Tamil Nadu Election: 9 గంటలకే తమిళనాడులో భారీ పోలింగ్.. కారణమిదేనా?

  • తమిళనాడులో పోలింగ్ జాతర
  • ఉదయం 9 గంటలకే భారీ పోలింగ్
  • పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టిన ఓటర్లు
Tamilnadu

Tamilnadu

తమిళనాడులో పోలింగ్ జాతర జోరుగా సాగుతోంది. ఓటింగ్ ప్రారంభం కాకముందే పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటలకు 17.69 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. వేసవి కాలం కావడంతో ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు ఉదయమే ఓటర్లు తరలివచ్చారు. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. తమిళనాడులో మొత్తం 324 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని 2 రెండు గంటలు పోలింగ్ సమయాన్ని పొడిగించాలని టీవీకే అధినేత విజయ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రయాణ అంతరాయాలు, పొడవైన క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అనివార్య పరిస్థితుల కారణంగా పోలింగ్‌ను రాత్రి 8:00 గంటల వరకు పొడిగించాలని లేఖలో విజయ్ విజ్ఞప్తి చేశారు.

ఓటేసిన ప్రముఖులు
సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో ఓటు వేశారు. విజయ్ తెల్ల చొక్కా, దానికి సరిపోయే తెల్ల ప్యాంటు ధరించి పోలింగ్ బూత్‌కు వచ్చారు. విజయ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ చెన్నైలోని ఆల్వార్‌పేట్ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరువాన్మియూర్‌లో నటుడు అజిత్ కుమార్ ఓటు వేశారు.