Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం
- సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై వాదనలు
- న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది మే నెలలో హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కాళ్లపారాణి ఆరకముందే ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది ఇల్లాలు. అయితే ఈ కేసులో ఇటీవల ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. దీంతో బాధిత కుటుంబంతో పాటు యావత్తు దేశం అవాక్కైంది. ఇంత సీరియస్ కేసులో నిందితురాలికి బెయిల్ ఎలా వచ్చిందని నిశ్చేష్టులయ్యారు.

Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
దీంతో నిందితురాలు సోనమ్ రఘువంశీ బెయిల్ రద్దు చేయాలంటూ బాధిత కుటుంబం షిల్లాంగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఇరువర్గాలు వాదనలు వినిపించారు. అయితే విచారణ పూర్తి కాకపోవడంతో శుక్రవారానికి వాయిదా పడింది. ఇప్పుడు తదుపరి విచారణపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. బెయిల్ రద్దవుతుందా? లేదంటే కొనసాగిస్తుందా? అన్నది సస్పెన్ష్గా ఉంది.
సోనమ్ రఘువంశీ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సంజీవ్ చందా వాదనలు వినిపించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గురువారం డిఫెన్స్ తమ వాదనలను వినిపించిందని తెలిపారు. వారి వాదనలపై కోర్టులో వివరంగా చర్చ జరిగిందని.. విచారణ చాలాసేపు కొనసాగిందని అన్నారు. అయితే వాదనలు పూర్తి కాలేదని.. విచారణను శుక్రవారం వరకు కొనసాగించాలని కోర్టు నిర్ణయించిందని చెప్పారు. తదుపరి విచారణలో డిఫెన్స్ తమ మిగిలిన వాదనలను వినిపిస్తుందని పేర్కొన్నారు.
సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరయ్యే అవకాశం ఉందా అని అడగ్గా.. సూటిగా సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని.. రాబోయే ఏ నిర్ణయంపైనా వ్యాఖ్యానించడం తగదని పేర్కొన్నారు. ప్రతి విచారణతో ఉత్సుకత పెరుగుతుండటంతో.. ఈ కేసు గణనీయమైన ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంది. గురువారం నాటి విచారణ తర్వాత.. ఇప్పుడు అందరి దృష్టి శుక్రవారం నాటి విచారణపైనే కేంద్రీకృతమై ఉంది.
తదుపరి విచారణపై అందరి దృష్టి
న్యాయ నిపుణుల ప్రకారం.. శుక్రవారం నాడు ప్రతివాద పక్షం తమ వాదనలను పూర్తి చేస్తుంది. దీని తర్వాత బెయిల్ పిటిషన్పై తదుపరి కార్యాచరణను కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అయితే తుది నిర్ణయం ఏమిటనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక సూచన రాలేదు. ప్రస్తుతం అందరి దృష్టి షిల్లాంగ్ కోర్టులో జరుగుతున్న విచారణపైనే ఉంది. ఈ కేసులో శుక్రవారం నాటి విచారణ కీలకమైనదిగా భావిస్తున్నారు.
గతేడాది మే 11న రాజా రఘువంశీ-సోనమ్ రఘువంశీకి వివాహమైంది. అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. విహార యాత్ర పేరుతో భర్తను నమ్మించి.. ప్రియుడితో కలిసి భర్తను సోనమ్ చంపేసింది. ఈ ఘటన యావత్తు దేశాన్ని కుదిపేసింది. తొలుత రాజా మృతదేహం లభించగా.. కొద్దిరోజుల తర్వాత సోనమ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఏడాది తర్వాత బెయిల్ లభించడంతో బాధిత కుటుంబం షాక్కు గురైంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!