Tamil Nadu: 8 ఏళ్ల బాలుడిని కొరికి చంపిన ఎలుగుబంటి.. చివరకు ఏం జరిగిందంటే..?
- తమిళనాడులో దారుణం..
- వాల్పారైలో 8 ఏళ్ల బాలుడిని కొరికి చంపిన ఎలుగుబంటి..
- బాలుడి మృతదేహాన్ని అటవీలో గుర్తించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో సోమవారం నాడు సాయంత్రం ఘోర విషయం చోటు చేసుకుంది. స్థానిక టీ తోటలో అస్సాం నుంచి వలస వచ్చి కూలీలుగా పని చేస్తున్న దంపతుల కుమారుడు నూర్-ఉల్-హక్ పాలు తీసుకురావడానికి సమీపంలోని ఇంటికి వెళ్లాగా.. ఆ సమయంలో దారి తప్పి వచ్చిన ఒక స్లోత్ ఎలుగుబంటి అతనిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది. ఇక, ఆ బాలుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అనేక చోట్ల వెతికారు. అయితే, మార్గమధ్యంలో చిందర వందరగా పాలు, రక్తపు మరకలు కనిపించాయి. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో టీ తోట కార్మికులు గాలించగా.. కొద్దీ దూరంలో నూర్-ఉల్-హక్ మృతదేహాన్ని కనుగొన్నారు. ఇక, బాలుడి ఒక కన్ను, ముఖంలోని ఒక భాగం, మెదడులోని కొంతభాగాన్ని ఎలుగుబంటి తిన్నట్లు అధికారులు గుర్తించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న కాడంపారై పోలీసులు, అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారు.
Read Also: Trivikram Srinivas: నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించలేను అన్నారు!
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
అయితే, ఇదే ప్రాంతంలో గత ఆరు నెలల్లో ఇది రెండో దారుణ ఘటన. జూన్ మాసంలో పాచమలై ఎస్టేట్ సమీపంలోని కలియమ్మాల్ నివాస ప్రాంతంలో జార్ఖండ్ నుంచి వలస వచ్చిన దంపతులకు చెందిన నలుగురేళ్ల రోషిని కుమారి ఆడుకుంటూ ఉండగా చిరుతపులి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ ఘటనపై పోలీసులు, అటవీ అధికారులు కలిసి రోషిని మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ చిన్నారి శరీర భాగాలు అక్కడక్కడా చిందర వందరగా పడ్డాయని చెప్పారు. ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తాజావార్తలు
-
YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!