Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- మండు వేసవిలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్
- ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఊహించని దెబ్బ
- బీజేపీలో విలీనం అవుతున్నట్లుగా ప్రకటన
- ఇటీవల అశోక్ మిట్టల్కు కీలక పదవి అప్పగించిన కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీకి మండు వేసవిలో భారీ షాక్ తగిలింది. ఇప్పుడిప్పుడే లిక్కర్ స్కామ్ నుంచి తేరుకుంటున్న సమయంలో రాఘవ్ చద్దా రూపంలో భారీ సంక్షోభం ముంచుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం ఊహించని రీతిలో రాఘవ్ చద్దా బీజేపీ పంచన చేరారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆధ్వర్యంలో కాషాయ గూటికి చేరారు. రాఘవ్ చద్దాతో పాటు మరో ఇద్దరు ఆప్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ కూడా చేరారు. వీరికి స్వయంగా నితిన్ నబిన్ స్వీట్లు తినిపించారు. మరో నలుగురు ఎంపీలు కూడా బీజేపీలో చేరుతున్నట్లు రాఘవ్ చద్దా సంకేతాలు ఇచ్చారు. రాజ్యసభలో మొత్తం ఆప్కు 10 మంది ఎంపీలు ఉండగా ఏడుగురు తిరుగుబావుటా ఎగరేయడంతో అన్హరత వేటు తప్పించుకునేందుకు 2/3 వంతు చీలికతో బీజేపీలో విలీనం అవుతున్నట్లుగా రాఘవ్ చద్దా ప్రకటించారు. ఇది ఆప్కు ఊహించని షాక్.
అశోక్ మిట్టల్..
అశోక్ మిట్టల్.. కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాల్సి వస్తే తన బంగ్లాలో ఉండాలని అశోక్ మిట్టల్ ఆహ్వానించారు. దీంతో ఏడాది పాటు కేజ్రీవాల్.. అశోక్ మిట్టల్ నివాసంలోనే ఉన్నారు. కానీ ఈ స్థాయిలో వెన్నుపోటు పొడుస్తాడని కేజ్రీవాల్ ఊహించలేకపోయారు. ఒకప్పుడు కేజ్రీవాల్ పట్ల విధేయత చూపించిన వాళ్లే.. ఇప్పుడు ద్రోహులుగా మారిపోయారు.
Also Read
- Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏప్రిల్ 2న రాఘవ్ చద్దాకు ఆప్ షాకిచ్చింది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్గా ఉన్న రాఘవ్ చద్దాను తప్పించి ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయానికి అధికారిక లేఖను కూడా పంపింది. అంతగా అశోక్ మిట్టల్ను కేజ్రీవాల్ నమ్మారు. కానీ అతడే వెన్నుపోటు పొడుస్తాడని కేజ్రీవాల్ ఊహించలేకపోయారు.
రాఘవ్ చద్దా ఒక్కరే పార్టీ వీడుంటే అనర్హత వేటు పడేది. ఆ వేటు నుంచి తప్పించుకునేందుకు తనతో పాటు మరో ఆరుగురు ఎంపీలను తీసుకెళ్లిపోయారు. రాఘవ్ చద్దాతో పాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ బీజేపీ గూటికి చేరుతున్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!