Raghav chadha: రాఘవ్ చద్దా వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో అంతర్గత పోరును బయటపెట్టింది. ఇటీవల రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించింది. దీని తర్వాత ఆప్ నాయకుడు చద్దాపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత ఆతిశీ మాట్లాడుతూ.. ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైయ్యారని ఆరోపించింది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని ఆప్ మరో నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
అయితే, ఆప్ చేస్తున్న విమర్శలకు రాఘవ్ చద్దా ‘‘ధురంధర్’’ స్టైల్లో స్పందించారు. తనపై ఆప్ చేస్తున్న విమర్శలకు ‘‘ నేను గాయపడ్డాను, అందుకే ప్రాణాంతకం’’ అని అన్నారు. ఈ సినిమా డైలాగ్తో చద్దా ఆప్కు రిఫ్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా చద్దా మాట్లాడుతూ.. తనపై వచ్చిన అన్ని ఆరోపణలు అసత్యమని, తనపై కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ముందుగా నేను వీటిపై స్పందించకూడదని అనుకున్నానని, అయితే ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే కొంత మంది దాన్ని నిజమని నమ్మే అవకాశం ఉందనే స్పందించినట్లు చెప్పారు.
Read Also: Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు
ప్రతిపక్షాలు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసిన సమయంలో తాను అక్కడే కూర్చున్నానని, వాకౌట్ చేయలేదనే తనపై ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా అబద్ధమని చద్దా అన్నారు. తాను ప్రతీ సందర్భంతో ప్రతిపక్షాలతో కలిసే ఉన్నానని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ అభిశంసన తీర్మానంపై సంతకం చేయడానికి తాను నిరాకరించానన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన ఇంకా పేర్కొన్నారు. ఏ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కూడా తనను ఆ తీర్మానంపై సంతకం చేయమని అడగలేదని చెప్పారు. ఆప్కు 10 మంది ఎంపీలు ఉంటే 6 లేదా 7 మంది సంతకం చేయలేదనే విషయాన్ని చద్దా గుర్తు చేశారు. తాను పనికిమాలిన విషయాలను లేవనెత్తుతున్నానని ఆరోపిస్తున్నారని, తాను గొడవ చేయడానికి పార్లమెంట్కు వెళ్లలేదని చద్దా స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు లేవనెత్తడానికి సభకు వెళ్తున్నారని అన్నారు.
मैं बोलना नहीं चाहता था, मगर चुप रहता तो बार-बार दोहराया गया झूठ भी सच लगने लगता।
Three Allegations. Zero Truth.
My Response: pic.twitter.com/tPdjp04TLt
— Raghav Chadha (@raghav_chadha) April 4, 2026
