Site icon NTV Telugu

Droupadi Murmu: బ్యాడ్మింటన్‌ ఆడిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Ekeke

Ekeke

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటారు. అలాంటిది కాసేపు క్రీడాకారిణిగా మారిపోయారు. కొద్దిసేపు షటిల్‌ రాకెట్‌ పట్టారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆమె బ్యాడ్మింటన్‌ ఆడారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రాష్ట్రపతి కార్యాలయంలో ఇన్‌స్ట్రాగామ్ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది కూడా చదవండి: Darshan: ఇంటి ఆహారం కోసం హైకోర్టులో హీరో దర్శన్ పిటిషన్

వీడియోలో ప్రెసిడెంట్ ముర్ము తెల్లటి సల్వార్-కుర్తా మరియు స్పోర్ట్స్ షూస్‌  ధరించారు. కోర్టులో ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆడారు. అనేక మంది సిబ్బంది, ప్రేక్షకులు వీక్షించారు. ప్రెసిడెంట్ మూడు పాయింట్లు సాధించడం మరింత ఆశ్చర్యకరమైన విషయం.

Exit mobile version