NTV Telugu Site icon

రైతులకు మోడీ సర్కార్ తీపికబురు..ఇవాళే అకౌంట్లలో డబ్బులు

రైతుల‌కు అండ‌గా ఉంటున్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. తెలంగాణ‌లో ఉన్న రైతు బంధు ప‌థ‌కం త‌ర‌హాలో.. దేశ‌వ్యాప్తంగా.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ పథకంలో 9 కోట్లకు పైగా రైతులు చేరిన‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయి.. ఇక‌, పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతుకు ఏడాదికి రూ.6,000 అంద‌జేస్తోంది మోడీ స‌ర్కార్.. ఆ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జ‌మ‌చేస్తూ వ‌స్తున్నారు.. అయితే తాజాగా..
ఈ పథకం కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ (శుక్రవారం) విడుదల చేయనున్నారు. ఈ విడతలో రూ. 19000 కోట్లను 9.5 కోట్ల మందికి పైగా రైతులకు అందించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సాయాన్ని మోదీ విడుదల చేస్తారని పేర్కొంది.