ప్రధాని మోడీ సిక్కింలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం సిక్కింకు వెళ్లారు. సిక్కింకు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్యాంగ్టక్లోని ఆర్కిడేరియంను సందర్శించారు. అనంతరం పాల్జోర్ స్టేడియంలో సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ 50వ వార్షికోత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే అంతకముందు క్రీడా మైదానంలో యువతీయువకులతో కలిసి మోడీ కొద్దిసేపు ఫుట్బాల్ ఆడారు.
ఫుట్బాల్ ఆటకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్లో పంచుకున్నారు. ‘గ్యాంగ్టక్లో ఒక ఆహ్లాదకరమైన ఉదయం. సిక్కింలో నా చిన్ని స్నేహితులతో ఫుట్బాల్ ఆడటం ఒక విభిన్నమైన సరదా!.’’ అని రాసుకొచ్చారు.
ఇక పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 4,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి.. జాతికి అంకితం చేయనున్నారు. ఇక రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.
Nothing like playing some football with my young friends in Sikkim on a lovely Gangtok morning! ⚽️ pic.twitter.com/5xEceWBH1f
— Narendra Modi (@narendramodi) April 28, 2026
