Site icon NTV Telugu

CCS meeting: ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోడీ అధ్యక్షతన “సెక్యూరిటీ” మీటింగ్..

Pm Modi

Pm Modi

CCS meeting: పశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ‘క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ’ (CCS) ఉన్నతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇది రెండో సీసీఎస్ సమావేశం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌పై ప్రభావం గురించి మీటింగ్‌లో చర్చించనున్నారు.

Read Also: Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు

కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జె.పి. నడ్డా, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్, ప్రహ్లాద్ జోషి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, హర్దీప్ సింగ్ పూరి ఈ సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శులు పి.కె. మిశ్రా, శక్తికాంత దాస్, అలాగే క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దీనికి ముందు మార్చి 22న తొలి సీసీఎస్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఆహారం, చమురు, ఇంధన భద్రతపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఆదివారం ప్రధాని మోడీ ‘‘మన్‌ కీ బాత్’’ లో మాట్లాడుతూ.. క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.

Exit mobile version