Pahalgam Terror Attack: హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే పహల్గామ్ దాడి.. నివేదిక వర్గాలు నిర్ధారణ!
- హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే పహల్గామ్ దాడి
- నివేదిక వర్గాలు నిర్ధారణ!
పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక ఉన్న కుట్రను కేంద్ర సంస్థలు వెలికితీస్తున్నాయి. 26/11 ముంబై దాడుల కుట్రదారుడు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోనే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినట్లుగా భద్రతా సంస్థలు ఇక నిర్ధారణకు వచ్చినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
పహల్గామ్ దాడి జరగగానే తామే ఈ దాడి చేసినట్లుగా ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఇది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఉంది. దీనికి హఫీజ్ సయీద్ ముఖ్య అనుచరుడైన సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి నేతృత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి ఆధ్వర్యంలోనే ఈ ఉగ్ర సంస్థలు నడుస్తున్నాయి. ఇద్దరి మాడ్యూల్ ప్రకారం పహల్గామ్ దాడి జరిగినట్లుగా భారత నిఘా సంస్థలు కనిపెట్టాయి. ఇక ఈ ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సైన్యం, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పూర్తి మద్దతు ఉంటుంది. సైద్ధాంతిక, లాజిస్టికల్ మరియు వ్యూహాత్మక మద్దతు ఇస్తుంటాయి.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
ఇక స్థానిక ఉగ్రవాదుల మద్దతుతో బైసరన్ లోయలో లష్కరే తోయిబా దాడులకు పాల్పడినట్లుగా గుర్తించింది. ముందుగా అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేసినట్లుగా అనుమానిస్తు్న్నారు. స్థానిక మద్దతుదారుల సహకారంతోనే ఈ ఉగ్ర దాడి జరినట్లుగా ఒక నిర్ధారణకు వచ్చారు. 2024, అక్టోబర్లో బూటా పత్రి దగ్గర జరిగిన ఉగ్ర దాడిలో కూడా ఈ పహల్గామ్లో పాల్గొన్నవారే ఉన్నట్లుగా గుర్తించింది. ఆ దాడిలో ఇద్దరు సైనికులతో పాటు నలుగురు సామాన్య పౌరులు చనిపోయారు. అదే నెలలో సోనామార్గ్లో సొరంగం నిర్మాణ కార్మికులపై జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు చనిపోయాడు. ఈ దాడిలో కూడా ఈ ఉగ్రవాదులే పాల్గొన్నట్టుగా కనిపెట్టారు. వీళ్లంతా లష్కరే తోయిబా కనుసన్నల్లో నడుచుకుంటున్నట్లుగా గుర్తించారు. పహల్గామ్ ఉగ్రవాదుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
ఇక మంగళవారం ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులు ఊహాచిత్రాలను బుధవారం విడుదల చేశారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో పాకిస్థాన్కు చెందిన హషీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా, మూడో వ్యక్తి స్థానిక నివాసి అబ్దుల్ హుస్సేన్ థోకర్గా గుర్తించారు. ఇక వీళ్ల సమాచారం అందిస్తే.. రూ.20లక్షల రివార్డ్ ఇస్తామని ఇప్పటికే భద్రతా దళాలు ప్రకటించాయి.
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉండడం విశేషం. అనేక మంది గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. ఇక ఈ ఘటనతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికీ ఆ ఘటనను నుంచి తేరుకోలేకపోతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?