Pahalgam Terror Attack: హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే పహల్గామ్ దాడి.. నివేదిక వర్గాలు నిర్ధారణ!
- హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే పహల్గామ్ దాడి
- నివేదిక వర్గాలు నిర్ధారణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక ఉన్న కుట్రను కేంద్ర సంస్థలు వెలికితీస్తున్నాయి. 26/11 ముంబై దాడుల కుట్రదారుడు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోనే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినట్లుగా భద్రతా సంస్థలు ఇక నిర్ధారణకు వచ్చినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
పహల్గామ్ దాడి జరగగానే తామే ఈ దాడి చేసినట్లుగా ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఇది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఉంది. దీనికి హఫీజ్ సయీద్ ముఖ్య అనుచరుడైన సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి నేతృత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి ఆధ్వర్యంలోనే ఈ ఉగ్ర సంస్థలు నడుస్తున్నాయి. ఇద్దరి మాడ్యూల్ ప్రకారం పహల్గామ్ దాడి జరిగినట్లుగా భారత నిఘా సంస్థలు కనిపెట్టాయి. ఇక ఈ ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సైన్యం, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పూర్తి మద్దతు ఉంటుంది. సైద్ధాంతిక, లాజిస్టికల్ మరియు వ్యూహాత్మక మద్దతు ఇస్తుంటాయి.
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఇక స్థానిక ఉగ్రవాదుల మద్దతుతో బైసరన్ లోయలో లష్కరే తోయిబా దాడులకు పాల్పడినట్లుగా గుర్తించింది. ముందుగా అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేసినట్లుగా అనుమానిస్తు్న్నారు. స్థానిక మద్దతుదారుల సహకారంతోనే ఈ ఉగ్ర దాడి జరినట్లుగా ఒక నిర్ధారణకు వచ్చారు. 2024, అక్టోబర్లో బూటా పత్రి దగ్గర జరిగిన ఉగ్ర దాడిలో కూడా ఈ పహల్గామ్లో పాల్గొన్నవారే ఉన్నట్లుగా గుర్తించింది. ఆ దాడిలో ఇద్దరు సైనికులతో పాటు నలుగురు సామాన్య పౌరులు చనిపోయారు. అదే నెలలో సోనామార్గ్లో సొరంగం నిర్మాణ కార్మికులపై జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు చనిపోయాడు. ఈ దాడిలో కూడా ఈ ఉగ్రవాదులే పాల్గొన్నట్టుగా కనిపెట్టారు. వీళ్లంతా లష్కరే తోయిబా కనుసన్నల్లో నడుచుకుంటున్నట్లుగా గుర్తించారు. పహల్గామ్ ఉగ్రవాదుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
ఇక మంగళవారం ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులు ఊహాచిత్రాలను బుధవారం విడుదల చేశారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో పాకిస్థాన్కు చెందిన హషీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా, మూడో వ్యక్తి స్థానిక నివాసి అబ్దుల్ హుస్సేన్ థోకర్గా గుర్తించారు. ఇక వీళ్ల సమాచారం అందిస్తే.. రూ.20లక్షల రివార్డ్ ఇస్తామని ఇప్పటికే భద్రతా దళాలు ప్రకటించాయి.
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉండడం విశేషం. అనేక మంది గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. ఇక ఈ ఘటనతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికీ ఆ ఘటనను నుంచి తేరుకోలేకపోతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!