Randhir Jaiswal: ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవు.. మరోసారి పాక్కు తేల్చిచెప్పిన భారత్
- ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవు
- మరోసారి పాక్కు తేల్చిచెప్పిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఇరాన్లో పర్యటిస్తూ భారత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్, జల వివాదం, ఉగ్రవాదంపై భారత్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. శాంతి కోరుకునే వాళ్లు చర్చలకు రావాలంటూ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Pakistan: ‘‘అవును, భారత్ బ్రహ్మోస్తో మా ఎయిర్బేస్లపై దాడి చేసింది’’..ఒప్పుకున్న పాక్ ప్రధాని..
Also Read
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
తాజాగా భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవని.. పాకిస్థాన్ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని తేల్చిచెప్పారు. పాకిస్థాన్ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉందని చెప్పారు. ఏవైనా సంబంధాలు ద్వైపాక్షికంగా ఉండాలన్నారు. ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవని మరోసారి తేల్చి చెప్పారు. తాము అందించిన రికార్డుల ప్రకారం ఉగ్రవాదులను అప్పగించాలని డిమాండ్ చేశారు. పీవోకేను అప్పగిస్తేనే.. పాకిస్థాన్తో చర్చలుంటాయని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ తిరుగులేని మద్దతిస్తోందని.. అది మానుకునే వరకు సింధు జలాలు నిలిపివేయబడుతుందన్నారు. మోడీ చెప్పినట్లుగా… ఉగ్రవాదం-వాణిజ్యం, నీరు-రక్తం కలిసి ప్రవహించలేవని చెప్పారని రణధీర్ జైస్వాల్ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Sukumar : ఆ మూడు సినిమాలు చేసి ఉంటే సినిమాలు ఆపేసేవాడిని..
ఇక ఇరాన్లో తప్పిపోయిన ముగ్గురు భారతీయ పౌరుల గురించి టెహ్రాన్ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈనెల మొదటి వారంలో ఇరాన్లో తప్పిపోయినట్లు చెప్పారు. వారిని గుర్తించడం, వారి భద్రత, స్వదేశానికి తిరిగి రప్పించడం కోసం ఇరాన్ అధికారులతో సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం వస్తోందని.. కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందించనట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్కు సింధు జలాలు నిలిపేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసేసింది. అనంతరం మే 7న భారత్.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి.
#WATCH | Delhi: On three Indian nationals who went missing in Iran, MEA Spokesperson Randhir Jaiswal says, "… The three Indian nationals who had landed in Tehran, Iran, some time back, are missing. We are in touch with the Iranian authorities for locating them, their safety and… pic.twitter.com/ycOIcia8zy
— ANI (@ANI) May 29, 2025
తాజావార్తలు
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!