Al-Falah University: హోదాను ఎందుకు రద్దు చేయకూడదు.. జాతీయ మైనార్టీ సంస్థ నోటీసు
- హోదాను ఎందుకు రద్దు చేయకూడదు
- అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి జాతీయ మైనార్టీ సంస్థ నోటీసు
యూనివర్సిటీకి చెందిన మైనారిటీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదంటూ అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఢిల్లీ పేలుళ్ల కేసుతో సంబంధాల దృష్ట్యా అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాను ఎందుకు ఉపసంహరించుకోకూడదో తెలియజేయాలంటూ జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) షోకాజ్ నోటీసు జారీ చేసిందని వర్గాలు తెలిపాయి.
శుక్రవారం నోటీసు జారీ చేయగా.. డిసెంబర్ 4న ఈ విషయంపై విచారణ జరుగుతుందని నోటీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివేదికను సమర్పించాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్తో పాటు హర్యానాలోని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసు జారీ చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
ఇది కూడా చదవండి: Udaipur Wedding: బాలీవుడ్ హీరోలతో కలిసి డ్యాన్స్ చేసిన ట్రంప్ కుమారుడు.. వీడియో వైరల్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30(1) ప్రకారం భాషా, మతపరమైన మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించడానికి, నిర్వహించడానికి ప్రాథమిక హక్కును అందిస్తుంది. జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) ఒక పాక్షిక-న్యాయ సంస్థ. ఈ సంస్థ న్యాయనిర్ణేత, సలహా, సిఫార్సు అధికారాలను కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైనులతో సహా ఆరు మతపరమైన మైనారిటీ వర్గాలను నోటిఫై చేసింది.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి పబ్లిక్గా ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి
ఇక గురువారం మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలోని మోవ్ కంటోన్మెంట్ బోర్డు.. అల్ ఫలా గ్రూప్ చైర్మన్ జావాద్ అహ్మద్ సిద్ధిఖీకి చెందిన పూర్వీకుల ఆస్తిని తొలగించేందుకు నోటీసు జారీ చేసిందని, ఈ నిర్మాణం రక్షణ మంత్రిత్వ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణమని అధికారి తెలిపారు. మూడు రోజుల్లోగా ఆ నిర్మాణాన్ని తొలగించాలని, లేకుంటే కంటోన్మెంట్ బోర్డు తొలగింపు చర్య తీసుకుంటుందని నోటీసులో ఆదేశించింది.
తాజాగా దర్యాప్తులో మరొక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీలో చదివిన పూర్వ విద్యార్థికి కూడా టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉన్నట్లుగా తేలింది. వాస్తవంగా డాక్టర్ ఉమర్ కంటే మాజీ విద్యార్థితోనే ఉగ్ర సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ పూర్వ విద్యార్థి ఇండియన్ ముజాహిదీన్ కీలక సభ్యుల్లో ఒకడైన మీర్జా షాదాబ్ బేగ్ తెలుస్తోంది. 2007లో ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ పూర్తి చేశాడు. ఒక సంవత్సరం తర్వాత 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో పాల్గొన్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!