Al-Falah University: హోదాను ఎందుకు రద్దు చేయకూడదు.. జాతీయ మైనార్టీ సంస్థ నోటీసు
- హోదాను ఎందుకు రద్దు చేయకూడదు
- అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి జాతీయ మైనార్టీ సంస్థ నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూనివర్సిటీకి చెందిన మైనారిటీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదంటూ అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఢిల్లీ పేలుళ్ల కేసుతో సంబంధాల దృష్ట్యా అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాను ఎందుకు ఉపసంహరించుకోకూడదో తెలియజేయాలంటూ జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) షోకాజ్ నోటీసు జారీ చేసిందని వర్గాలు తెలిపాయి.
శుక్రవారం నోటీసు జారీ చేయగా.. డిసెంబర్ 4న ఈ విషయంపై విచారణ జరుగుతుందని నోటీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివేదికను సమర్పించాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్తో పాటు హర్యానాలోని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసు జారీ చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
ఇది కూడా చదవండి: Udaipur Wedding: బాలీవుడ్ హీరోలతో కలిసి డ్యాన్స్ చేసిన ట్రంప్ కుమారుడు.. వీడియో వైరల్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30(1) ప్రకారం భాషా, మతపరమైన మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించడానికి, నిర్వహించడానికి ప్రాథమిక హక్కును అందిస్తుంది. జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) ఒక పాక్షిక-న్యాయ సంస్థ. ఈ సంస్థ న్యాయనిర్ణేత, సలహా, సిఫార్సు అధికారాలను కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైనులతో సహా ఆరు మతపరమైన మైనారిటీ వర్గాలను నోటిఫై చేసింది.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి పబ్లిక్గా ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి
ఇక గురువారం మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలోని మోవ్ కంటోన్మెంట్ బోర్డు.. అల్ ఫలా గ్రూప్ చైర్మన్ జావాద్ అహ్మద్ సిద్ధిఖీకి చెందిన పూర్వీకుల ఆస్తిని తొలగించేందుకు నోటీసు జారీ చేసిందని, ఈ నిర్మాణం రక్షణ మంత్రిత్వ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణమని అధికారి తెలిపారు. మూడు రోజుల్లోగా ఆ నిర్మాణాన్ని తొలగించాలని, లేకుంటే కంటోన్మెంట్ బోర్డు తొలగింపు చర్య తీసుకుంటుందని నోటీసులో ఆదేశించింది.
తాజాగా దర్యాప్తులో మరొక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీలో చదివిన పూర్వ విద్యార్థికి కూడా టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉన్నట్లుగా తేలింది. వాస్తవంగా డాక్టర్ ఉమర్ కంటే మాజీ విద్యార్థితోనే ఉగ్ర సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ పూర్వ విద్యార్థి ఇండియన్ ముజాహిదీన్ కీలక సభ్యుల్లో ఒకడైన మీర్జా షాదాబ్ బేగ్ తెలుస్తోంది. 2007లో ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ పూర్తి చేశాడు. ఒక సంవత్సరం తర్వాత 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో పాల్గొన్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!