Al-Falah University: హోదాను ఎందుకు రద్దు చేయకూడదు.. జాతీయ మైనార్టీ సంస్థ నోటీసు
- హోదాను ఎందుకు రద్దు చేయకూడదు
- అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి జాతీయ మైనార్టీ సంస్థ నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూనివర్సిటీకి చెందిన మైనారిటీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదంటూ అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఢిల్లీ పేలుళ్ల కేసుతో సంబంధాల దృష్ట్యా అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాను ఎందుకు ఉపసంహరించుకోకూడదో తెలియజేయాలంటూ జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) షోకాజ్ నోటీసు జారీ చేసిందని వర్గాలు తెలిపాయి.
శుక్రవారం నోటీసు జారీ చేయగా.. డిసెంబర్ 4న ఈ విషయంపై విచారణ జరుగుతుందని నోటీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. నివేదికను సమర్పించాలని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్తో పాటు హర్యానాలోని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసు జారీ చేసినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
- Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
- MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
- Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
ఇది కూడా చదవండి: Udaipur Wedding: బాలీవుడ్ హీరోలతో కలిసి డ్యాన్స్ చేసిన ట్రంప్ కుమారుడు.. వీడియో వైరల్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30(1) ప్రకారం భాషా, మతపరమైన మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించడానికి, నిర్వహించడానికి ప్రాథమిక హక్కును అందిస్తుంది. జాతీయ మైనారిటీ విద్యా సంస్థల కమిషన్ (NCMEI) ఒక పాక్షిక-న్యాయ సంస్థ. ఈ సంస్థ న్యాయనిర్ణేత, సలహా, సిఫార్సు అధికారాలను కలిగి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైనులతో సహా ఆరు మతపరమైన మైనారిటీ వర్గాలను నోటిఫై చేసింది.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి పబ్లిక్గా ప్రసంగించిన మాజీ ఉపరాష్ట్రపతి
ఇక గురువారం మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలోని మోవ్ కంటోన్మెంట్ బోర్డు.. అల్ ఫలా గ్రూప్ చైర్మన్ జావాద్ అహ్మద్ సిద్ధిఖీకి చెందిన పూర్వీకుల ఆస్తిని తొలగించేందుకు నోటీసు జారీ చేసిందని, ఈ నిర్మాణం రక్షణ మంత్రిత్వ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణమని అధికారి తెలిపారు. మూడు రోజుల్లోగా ఆ నిర్మాణాన్ని తొలగించాలని, లేకుంటే కంటోన్మెంట్ బోర్డు తొలగింపు చర్య తీసుకుంటుందని నోటీసులో ఆదేశించింది.
తాజాగా దర్యాప్తులో మరొక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. యూనివర్సిటీలో చదివిన పూర్వ విద్యార్థికి కూడా టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉన్నట్లుగా తేలింది. వాస్తవంగా డాక్టర్ ఉమర్ కంటే మాజీ విద్యార్థితోనే ఉగ్ర సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. ఈ పూర్వ విద్యార్థి ఇండియన్ ముజాహిదీన్ కీలక సభ్యుల్లో ఒకడైన మీర్జా షాదాబ్ బేగ్ తెలుస్తోంది. 2007లో ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ పూర్తి చేశాడు. ఒక సంవత్సరం తర్వాత 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో పాల్గొన్నట్లు తేలింది.
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!