Mamata Banerjee-EC: బెంగాల్‌‌లో తక్షణమే ‘సర్’ నిలిపేయండి.. ఈసీకి మమత లేఖ

  • బెంగాల్‌‌లో తక్షణమే ‘సర్’ నిలిపేయండి
  • ఈసీకి ముఖ్యమంత్రి మమత లేఖ
Mamata Banerjee

Mamata Banerjee

కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం చేపట్టింది. మొట్టమొదటిగా వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఎన్నికల రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఈ ప్రత్యేక సర్వేను ఈసీ చేపట్టింది. మొదటి నుంచి విపక్షాలకు చెందిన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే సర్వే కారణంగా ఉపాధ్యాయులు ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకుంటున్న దుర్ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.

ఇది కూడా చదవండి: CJI BR Gavai: నేను లౌకికుడిని.. ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నా.. వీడ్కోలు ప్రసంగంలో గవాయ్ వ్యాఖ్య

ఈ నేపథ్యంలో బెంగాల్‌లో తక్షణమే ‘SIR’ నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఒక ప్రణాళిక లేకుండా ఈ సర్వే చేపడుతున్నారని ఆరోపించారు. అధిక పని భారంతో ఆత్మహత్యలు కూడా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా, బలవంతంగా, ప్రమాదకరంగా జరుగుతున్న ఈ సర్వే వెంటనే నిలిపివేసేలా తక్షణ చర్య తీసుకోవాలని సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను మమతా కోరారు. మూడు పేజీల లేఖలో అనేక విషయాలను మమత ప్రస్తావించారు.

ఇది కూడా చదవండి: Al-Falah University: ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. అల్-ఫలాహ్ సంస్థ అధినేత ఇల్లు కూల్చివేతకు నోటీస్

సరైన శిక్షణ లేకుండానే ఈ కార్యక్రమం చేపడుతున్నారని.. ఇది చాలా అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. డాక్యుమెంటేషన్‌పై కూడా స్పష్టత లేదన్నారు. ఇక ఓటర్లు జీవనోపాధి కారణంగా ఈ ప్రత్యేక సర్వేలో పాల్గొనలేకపోతున్నారని.. ప్రస్తుత ప్రక్రియ నిర్మాణాత్మకంగా చాలా బలహీనంగా ఉందని వివరించారు. పౌరులపై బలవంతంగా అమలు చేయడం అనేది ఏ మాత్రం భావ్యంగా లేదని పేర్కొన్నారు. బీఎల్‌వోలకు అధిక పని కారణంగా ఆన్‌లైన్ డేటా ఎంట్రీ, సర్వర్ సమస్యలు, తగినంత శిక్షణ లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో స్పష్టం చేశారు.