పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. మరోసారి సువేందు అధికారి చేతిలో ఘోర పరాజయం ఎదురైంది. భవానీపూర్లో కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఫలితం ఊగిసలాడుతూ వచ్చింది. మధ్యలో మమత మరోసారి లీడింగ్లోకి వచ్చినా.. కానీ అంతలోనే మారిపోయింది. చివరి రౌండ్లలో అనూహ్యంగా సువేందు అధికారి పుంజుకున్నారు. దాదాపు 15 వేల మెజార్టీతో మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించారు. 2021లో కూడా సువేందు అధికారి చేతిలోనే మమత ఓడిపోయారు. మరోసారి ఓడిపోయి పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్లో ఘోర పరాజయం
- మమతకు బిగ్ షాక్
- భవానీపూర్లో ఘోర పరాజయం
- సువేందు అధికారి చేతిలో మమత ఓటమి

Mamatabanerjee