NTV Telugu Site icon

ఢిల్లీ బాట‌లో మ‌రో రాష్ట్రం.. లాక్‌డౌన్ పొడిగింపు

Haryana

లాక్‌డౌన్ దేశ రాజధాని ఢిల్లీలో మంచి ఫ‌లితాలు ఇస్తోంది.. క్ర‌మంగా కొత్త కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి.. అయినా, ముందుచూపుతో.. మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఈ నెల 17వ తేదీతో ముగియనుండగా.. మరోసారి ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.. అయితే, ఢిల్లీ బాట‌లో మ‌రో రాష్ట్రం కూడా అడుగులు వేసింది.. క‌రోనా ఉధృతి నేపథ్యంలో హర్యానాలో మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఇవాళ‌ ఉత్తర్వులు జారీ చేసింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం.. ఇక్క‌డ తొలిసారి ఈ నెల 3 నుంచి 10 వరకు లాక్‌డౌన్ విధించ‌గా.. ఆ త‌ర్వాత‌ 17 వరకు పొడిగించారు.. ఇక‌, రేపటితో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల 24 వరకు హర్యానాలో లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. అయితే, కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో.. లాక్‌డౌన్‌ నిబంధనలు మ‌రింత‌ కఠినంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ అధికారులను ఆదేశించారు.