Gold Smuggling: పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు అక్రమ బంగారం తరలింపికు అడ్డుకట్ట పడటం లేదు. అనుమానితులను అదుపులో తీసుకుని బంగారం సీజ్ చేస్తున్న యదేచ్ఛగా అక్రమ బంగారాన్ని తరలించడాన్ని ప్లాన్ వేస్తున్నారు. ప్రయాణికులకు సోదాలు చేస్తూ కస్టమ్స్ అధికారులు పంపిస్తున్న మిగతావారిలో ఆభయం కనిపించడం లేదు. ఈ వార్తలను మామూలు విషయంగానే తీసుకుంటూ బంగారాన్ని తరలించే పనిలో పడ్డారు. ఈరోజు బంగాల్ కలకత్తా విమానాశ్రయంలో రెండుమార్లు అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఆధారంగా సింగపూర్ నుంచి వచ్చిన ఓ భారతీయ వ్యక్తి నుంచి సుమారు 1,140 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 27 బంగారు నాణేలు, 3 బంగారు కడ్డీలు ఉన్నాయి. వీటి ధర సుమారు రూ.56 లక్షలు ఉంటుందని అంచనా వేశారు అధికారులు.
కోల్ కతా విమానాశ్రయంలో అమెరికన్ డాలర్స్ భారీగా పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. అమెరికా నుండి కోల్ కతా వచ్చిన ఓ లేడి కిలాడి వద్ద సోదాలు నిర్వహించగా.. 1.03 కోట్ల విలువ 1, 30, 000 యూఎస్ డాలర్స్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేసారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా డాలర్స్ ను లగేజ్ బ్యాగ్ కింది భాగం లో దాచి తరలించే యత్నం చేసిన కిలాడి లేడి. కరెన్సీ సీజ్ లేడి కిలాడి పై FEMA చట్టం కింద కేసు నమోదు చేసి ED అధికారులకు అప్పగింత. దర్యాప్తు చేస్తున్న ED అధికారులు.
ఇక కేరళ కొజికోడ్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అరెస్టు చేసి, నిందితుడు కేజీ బంగారాన్ని నాలుగు క్యాప్సూల్స్లో నింపి కడుపులో దాచుకొని తరలిస్తున్నట్లు గుర్తించారు. మలప్పురం జిల్లా వరియంకోడ్కు చెందిన నౌఫల్ అనే వ్యక్తి దుబాయ్ నుంచి కొజీకోడ్కు వచ్చాడు. 1.063 కేజీల బంగారాన్ని 4 క్యాప్సూల్స్గా మార్చి కడుపులో పెట్టుకున్నాడు. పోలీసులు అతడిని తనిఖీ చేసినా బంగారాన్ని కనిపెట్టలేకపోయారు. అయినా అనుమానం వచ్చిన అధికారులు.. నిందితుడు నౌఫల్ను కొండొట్టిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అతడికి ఎక్స్రే తీయగా కడుపులో ఉన్న నాలుగు బంగారు క్యాప్సూల్స్ బయటపడ్డాయి.
Chinta Mohan: ఆంధ్రాకు అబద్ధాల ప్రదేశ్ అని పేరొచ్చింది
