కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంమైన పోలింగ్.. భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఓటు వేసేందుకు వస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ ఎత్తున క్యూలు ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. క్యూలో ఓటర్లు ఉంటే ఎన్ని గంటలైనా అనుమతి ఇస్తారు.
ఉదయం 11 గంటల వరకు అస్సాంలో 38.92 శాతం, కేరళంలో 32. 28 శాతం, పుదుచ్చేరిలో 37.06 శాతం ఓటింగ్ నమోదైంది. అన్ని చోట్ల భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా సాగుతోంది. ఎండ దెబ్బ తగలకుండా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఇక కేరళంలో ముఖ్యమంత్రి విజయన్, సినీ ప్రముఖులు మోహన్ లాల్, ముమ్మట్టి, కేంద్రమంత్రి సురేష్ గోపి, పలువురు రాజకీయ నాయకులు ఓటేశారు. ఇక అస్సాంలో ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఇక పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి బైక్పై వెళ్లి ఓటేశారు.
మొత్తం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతుండగా.. తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో జరగనున్నాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్లోని 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్లో 142 స్థానాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలకానున్నాయి.
State Assembly Elections | Approximate voter turnout as of 11 am –
Assam – 38.92%
Keralam – 33.28%
Puducherry – 37.06% pic.twitter.com/mZl3Bi5YXv— ANI (@ANI) April 9, 2026
