Site icon NTV Telugu

Karnataka: క్లాస్‌లోనే విద్యార్థినికి ప్రొఫెసర్ ‘‘ఐ లవ్ యూ’’.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Karnataka

Karnataka

Karnataka: బాధ్యతాయుతమైన ప్రొఫెసర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. క్లాస్ రూంలోనే అంతరి ముందు విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరులో ఉన్న శ్రీ సిద్ధార్థ వైద్య కళాశాల (SSMC)లో జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అబ్దుల్ విద్యార్థినికి ప్రపోజ్ చేయడం ఉద్రిక్తతల్ని పెంచింది. దీంతో ఆగ్రహించిన స్టూడెంట్స్ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. ఈ కాలేజీ కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వరకు చెందినది. ఈ ఘటన వైరల్ కావడంతో ప్రొఫెసర్‌ను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.

Read Also: Telangana Assembly: జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ అమోదం.. ఆ పోస్టుల పేర్లు మార్పు..

వైరల్ అవుతున్న వీడియోలో.. ‘‘మీ బ్యాచ్ చూపిస్తున్న అపారమైన ప్రేమను నేను తట్టుకోలేకపోయాను, మరియు మీ బ్యాచ్‌లోని అత్యంత ముఖ్యమైన అమ్మాయిలలో ఒకరికి నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను… మరియు నేను మొత్తం బ్యాచ్‌కు చాక్లెట్లు పంచుతాను.’’ అంటూ, సదరు అమ్మాయికి ‘‘ఐ లవ్ యూ’’ అని చెప్పాడు. ఈ ఘటన తర్వాత షాక్‌కు గురైన విద్యార్థిని ప్రొఫెసర్‌ను నిలదీసింది. స్టూడెంట్ తనను ప్రేమిస్తోందని, దానికి రుజువులు ఉన్నాయని ప్రొఫెసర్ చెప్పడం కొసమెరుపు. ‘‘నువ్వు నాకు ఐలవ్ యూ చెప్పావు. దీనికి సీసీటీవీ ఫుటేజ్ రుజువులు ఉన్నాయి’’ అని ప్రొఫెసర్ విద్యార్థినితో అన్నాడు. దీని తర్వాత విద్యార్థిని తన చెప్పుతో ప్రొఫెసర్‌ను కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. క్యాంపస్‌లో వెంబడించి మరీ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనలో అబ్దుల్‌ను సస్పెండ్ చేయగా, దీనిపై విచారణ జరుగుతోంది.

Exit mobile version