జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ఎన్నికల బృందం జమ్మూకాశ్మీర్లో పర్యటించింది. సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్.సంధు నేతృత్వంలోని ఎన్నికల బృందం శ్రీనగర్లో పర్యటించింది. శ్రీనగర్లో అధికారులతో సమావేశమై పరిస్థితుల్ని సమీక్షించారు. ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటే జమ్మూకాశ్మీర్ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
An ECI delegation led by CEC Rajiv Kumar and ECs Gyanesh Kumar and Dr. SS Sandhu arrived at Srinagar today to review poll preparedness in J&K. #AssemblyElections #ECI pic.twitter.com/aKfurMoCV0
— Election Commission of India (@ECISVEEP) August 8, 2024