Site icon NTV Telugu

Pahalgam Attack: ఉగ్రవాదుల మారణహోమంపై కీలక ఆధారాలు లభ్యం.. భారత్‌లోకి ఎలా వచ్చారంటే..!

Pahalgamattack

Pahalgamattack

పహల్గామ్ ఉగ్ర దాడిపై కేంద్ర సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. తాజాగా ఉగ్రవాదులు భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై దర్యాప్తు చేపట్టగా అధికారులకు కీలక సమాచారం లభించింది.

ఇది కూడా చదవండి: Kollywood : దళపతి విజయ్.. త్రిష లవ్ ఎఫైర్.. నిజమెంత.?

బాట్కోట్‌కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, హిల్ పార్క్‌కు చెందిన బషీర్ అహ్మద్ జోథర్‌లను అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిద్దరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లుగా ఒప్పకున్నారు. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత.. ముగ్గురు ఉగ్రవాదులకు హిల్ పార్క్‌లోని ఒక గుడిసెలో ఉన్నట్లుగా తేలింది. ఈ ఉగ్రవాదులకు స్థానికులైన పర్వైజ్, బషీర్ ఆహారం, ఇతర వసతులు కల్పించినట్లుగా తేలింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ చేరవేసినట్లుగా గుర్తించారు.

ఇది కూడా చదవండి: Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

ఇక ముగ్గురు ఉగ్రవాదులు.. పాకిస్థాన్‌లోని అబోటాబాద్ నుంచి ముజఫరాబాద్ మీదుగా పూంజ్-రాజౌరికి చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. సరిహద్దు కారిడార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక నిఘా వర్గాల దర్యాప్తు మేరకు.. ముగ్గురు ఉగ్రవాదులు కూడా అధిక శిక్షణ పొందినవారుగా కనిపెట్టారు. శిక్షణలో అధునాతన పోరాట పటిమలు కలిగిన వారిగా తేల్చారు. అంతేకాకుండా రహస్య కదలికలు, మనుగడ వ్యూహాలు కలిగి ఉన్నట్లుగా తేలింది. పహల్గామ్‌కు ముందు జమ్మూకాశ్మీర్‌లోని స్పిన్నర్ ప్రాంతంలో జరిగిన దాడులతో పాటు పలు దాడుల్లో ఈ ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొని ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇక ఉగ్రవాదుల కదలికలు గురించి డిజిటల్ పాదముద్రలు, కమ్యూనికేషన్ మార్గాలను దర్యాప్తు సంస్థ విశ్లేషిస్తోంది. ప్రత్యేక కమ్యూనికేషన్ ఉపయోగించడం వల్ల ట్రాకింగ్ కష్టతరంగా మారింది. ప్రధానంగా స్థానికుల మద్దతుతోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం స్థానికులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాదులు చెలరేగిపోయారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. స్త్రీలను, పిల్లలను వదిలిపెట్టి భర్తలను చంపేశారు. పదుల కొద్ది గాయపడ్డారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తానికి పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.

Exit mobile version