Site icon NTV Telugu

INS Taragiri: మరింత శక్తివంతంగా భారత్.. నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఆయుధాలు

5

5

భారత్ రక్షణ వ్యవస్థ మరింత శక్తివంతంగా మారింది. నిన్నామొన్నటి దాకా ఒకెత్తు అయితే ఇప్పుడు మరోకెత్తుగా మారింది. తాజాగా భారత రక్షణ వ్యవస్థలో రెండు అత్యంత శక్తివంతమైన ఆయుధాలు చేరాయి. దీంతో భారత బలం మరింత పుంజుకోనుంది. ఈ ఆయుధాల చేరికతో శత్రువు గుండెల్లో దడపుట్టాల్సిందే.

భారత నౌకాదళం మరింత శక్తివంతంగా మారబోతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. శత్రువును భయపెట్టేందుకు ఐఎన్ఎస్ అరిదమాన్, ఐఎన్ఎస్ తారాగిరిలను నౌకాదళానికి అప్పగించబోతున్నట్లు పేర్కొన్నారు. రెండు కూడా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బలమైన అణు జలాంతర్గామి‌లు. మొదటిది ఐఎన్ఎస్ అరిదమాన్ కాగా.. రెండవది అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తారాగిరి. ఈ రెండు కూడా శత్రు దేశాలు భారత జలాలు వైపు కన్నెత్తి చూడాలంటేనే వెన్నులో వణికిపుట్టిస్తాయి.

‘‘ఇవి కేవలం మాటలు కాదు.. ఇది శక్తి.’’ అని ఎక్స్‌లో రాజ్‌నాథ్‌సింగ్ రాసుకొచ్చారు. ‘‘ఈ జలాంతర్గామి భారతదేశపు సముద్ర అణు భద్రతను మరింత బలోపేతం చేస్తుంది.’’ అని పేర్కొన్నారు. విశాఖపట్నంలో అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ‘‘ఐఎన్ఎస్ తారాగిరి’’ని నౌకాదళానికి రాజ్‌నాథ్‌సింగ్ అప్పగించనున్నారు.

ఐఎన్ఎస్ అరిదమన్ సుదూర క్షిపణులతో కూడి ఉంది. ఇది శత్రువులను మరింత దూరం నుంచి లక్ష్యంగా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ జలాంతర్గామి ఇప్పుడు తన తుది సముద్ర పరీక్షలను పూర్తి చేసుకుంది. త్వరలో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్‌లో ప్రవేశించబోతుంది. దీనికి ముందు 2016లో ఐఎన్ఎస్ అరిహంత్, ఆగస్టు 2024లో ఐఎన్ఎస్ అరిఘాట్ ప్రవేశపెట్టారు.

రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ‘తారాగిరి’ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమయంలోనే ‘‘అరిదమాన్’’ గురించి కూడా ప్రస్తావించారు. ఈ జలాంతర్గామి ఏప్రిల్, మే నెలల మధ్య సేవలోకి ప్రవేశిస్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి డిసెంబర్ 2025లోనే తెలిపారు. ప్రస్తుతం తుది పరీక్షలు పూర్తయ్యాయి

స్టెల్త్ టెక్నాలజీ: ఇందులో మెరుగైన సోనార్-శోషక పూత, శబ్దాన్ని తగ్గించే సాంకేతికత ఉన్నాయి, దీంతో శత్రువులు దీనిని గుర్తించడం కష్టమవుతుంది.
దీర్ఘ పరిధి: కె-4 క్షిపణులతో ఇది శత్రువు యొక్క లోతట్టు భూభాగాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఇది భారతదేశ భద్రతకు అత్యంత కీలకం.
స్వదేశీ సాంకేతికత: ఈ జలాంతర్గామి సుమారు 70 శాతం స్వదేశీ సామగ్రిని ఉపయోగిస్తుంది. ఇది భారతదేశ స్వావలంబనను చాటిచెబుతుంది.

 

Exit mobile version