తమిళనాడులో ట్విస్ట్లు మీద ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం సాయంత్రం గవర్నర్ అర్లేకర్ను విజయ్ కలిసి చిన్న పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలను అందజేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలన్నీ అవాస్తవం అని లోక్భవన్ కొట్టిపారేసింది. విజయ్ను ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదని గవర్నర్ వర్గాలు పేర్కొన్నాయి.
విజయ్కు వామపక్షాలు మాత్రమే మద్దతు తెల్పాయి. వీసీకే, ముస్లిం లీగ్ పార్టీలు అంశాల వారీగా మాత్రమే మద్దతు ఇస్తామని ప్రకటించాయి. దీంతో విజయ్ బలం 116కు మాత్రమే చేరింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ లేదని గవర్నర్ మెలిక పెట్టడంతో రేపటి ప్రమాణస్వీకారం ఆగిపోయింది.
