ఈ మధ్య ఎక్కువ మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం కన్నా నోటికి రుచిగా ఉండే ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తింటున్నారు.. అందులో గోభి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. ఆ రుచి అలాంటిది మరి.. ఇంట్లో చేసుకోవడం లేదా సమయం లేనప్పుడు బయటకు వెళ్లి ఎవరికి తగ్గట్లు వాళ్లు తింటారు.. చాలా మంది ఫేవరెట్ ఫుడ్పై నిషేధం విధించింది గోవాలోని ఓ పట్టణంలో గోబీని ఎక్కడా అమ్మకూడదని తేల్చేసింది.. ఎందుకు అలా చేసిందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
గోబీ మంచూరియ లో కలర్ ఫుల్ గా కనిపించడం కోసం తయారీలో సింథెటిక్ కలర్స్ వాడుతున్నారన్న కారణంతోనే దానిపై నిషేధం విధించింది మపుసా మున్సిపల్ కౌన్సిల్.. గోవాలో ఈ గోబీని బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది.. 2022లో జరిగిన వాస్కో సప్తా ఫెయిర్ సమయంలోనూ ఇది నిషేధానికి గురైంది.. కేవలం ఆర్దర్స్ పాస్ మాత్రమే కాదు.. సిటీలో ఎక్కడైనా అమ్ముతున్నారా? లేదా అని అధికారులు ప్రత్యేకంగా రైడ్స్ చేసి చేశారు..
ఈ గోబీని నిషేదించడానికి కారణం కూడా లేకపోలేదు.. శుభ్రత కూడా ఒక కారణం అని తెలుస్తోంది.. ఈ మంచూరియాను 1970లో తొలిసారి తయారీ చేసినట్లు తెలుస్తుంది.. ముంబైకి చెందిన దిగ్గజ చైనీస్ రెస్టారెంట్ నెల్సన్ వాంగ్.. దీనిని రూపొందించి, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు సర్వ్ చేసింది.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ వంట ప్రాచుర్యం పొందింది.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీనికి ఫ్యాన్స్ ఉన్నారు కూడా..
