Site icon NTV Telugu

Shocking : ప్రాణం తీసిన పబ్జీ గేమ్‌..

మహారాష్ట్రలోని ఆన్‌లైన్ పబ్జీ గేమ్ ఆడిన తర్వాత జరిగిన వివాదంలో తమ స్నేహితుడిని చంపినందుకు పోలీసులు మంగళవారం 20 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసి ఇద్దరు మైనర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థానేలోని వర్తక్ నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు స్నేహితులు తరచూ పబ్జీ గేమ్ ఆడుతూ, ఆ తర్వాత ఏదో ఒక సమస్యపై గొడవ పడుతుండేవారని వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సదాశివ నికమ్ తెలిపారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నలుగురు కలిసి మళ్లీ గేమ్ ఆడి మద్యం సేవించారు. వారు మళ్లీ గొడవ పడ్డారు.

వారిలో ముగ్గురు తమ స్నేహితుడు సయీల్ జాదవ్‌ను పదునైన కత్తితో పొడిచారని పోలీసులు వెల్లడించారు. బాధితుడు అక్కడికక్కడే మృతి చెందగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పబ్జీ అనే ఆన్‌లైన్ మల్టీ-ప్లేయర్ గేమ్‌కు ప్రజలు బానిసలుగా మారుతున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఇది మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందనే భయాలు ఉన్నాయి.

Exit mobile version