హై-పే ఐటీ ప్రొఫెషనల్ రెండు రోజులు హోటల్ రూమ్ ను లాక్ చేసి వెళ్లడం ఫేక్ కరెన్సీ కేసుకు దారి తీసింది. నోయిడాలోని ఒక మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తున్న వినాయక్ ఝా అనే ఐటీ ఇంజనీర్ను ఫరీదాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హోటల్ రూమ్లో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ సెటప్ బయటపడింది. ఈ కేసు ఐటీ సెక్టార్లో ఉన్నత వేతనాలు అందుకుంటున్న యువకులు కూడా ఇలాంటి నేరాలకి ఎందుకు పాల్పడుతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సంఘటన ఎలా జరిగింది?
వినయక్ ఝా జూన్ 26న ఫరీదాబాద్లోని సురజ్కుండ్లో ఉన్న అప్స్కేల్ హోటల్ సరోవర్ పోర్టికోలోని రూమ్ నంబర్ 404-Bలో చెక్-ఇన్ అయ్యాడు. కానీ రెండు రోజులు గడిచినా రూమ్ నుంచి ఎలాంటి కదలిక లేదు. రెండు రోజులైనా బయటకు రాకపోవడం, గదికి తాళం వేసి కీలు తనతోనే తీసుకెళ్లడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే సురజ్కుండ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హోటల్ సిబ్బంది సహాయంతో రూమ్ను తెరిచి సెర్చ్ చేశారు.
రూమ్ ఖాళీగా ఉన్నా, లోపల ల్యాప్టాప్, ప్రింటర్, కరెన్సీ ప్రింటింగ్కు ఉపయోగపడే స్పెషల్ A4 పేపర్, ఒక రూ.500 ఫేక్ నోటు, 10 రూ.100 ఫేక్ నోట్లు, ఇతర సామగ్రి లభ్యమయ్యాయి. హోటల్లో సమర్పించిన ఐడెంటిటీ డాక్యుమెంట్ల ఆధారంగా పోలీసులు అతన్ని ఫరీదాబాద్ సెక్టార్ 17లోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని రెండు రోజుల పోలీస్ రిమాండ్కు తీసుకున్నారు. కేసును NIT క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి కూడా ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగిని వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల దర్యాప్తు
ల్యాప్టాప్, ప్రింటర్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఇంతకు ముందు ఎంత ఫేక్ నోట్లు ప్రింట్ చేశాడో తెలుసుకునేందుకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కడే నడిపాడా లేదా పెద్ద నెట్వర్క్ లో భాగమా? ఎక్కడి నుంచి సామగ్రి కొన్నాడు? ఎవరైనా సహాయం చేశారా? హోటల్ CCTV ఫుటేజ్ పరిశీలన. అతని గత చరిత్ర, తల్లిదండ్రుల ఉద్యోగాల వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. BNS సెక్షన్లు 178 & 181 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

