MUDA scam: ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్య పేరు.. షాకిచ్చిన ఈడీ..
- సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాక్..
- ముడా స్కాంలో భార్యతో పాటు ఆయన ప్రమేయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MUDA scam: కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్లో సంబంధం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్ కేటాయింపులు వంటి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈడీ నివేదిక ప్రకారం.. ఈ కుంభకోణంలో అధికారిక రికార్డులు తారుమారు చేయడం, రాజకీయ ప్రభావాన్ని దుర్వినియోగం చేయడం, ఫోర్జరరీ వంటివి చోటు చేసుకున్నట్లు తెలిపింది. ప్రజాభివృద్ధి కోసం సేకరించిన భూమిని అక్రమంగా డీ నోటిఫై చేయడం ఈ కేసులో కీలకంగా ఉంది. ఈ ప్రక్రియను నిపుణుల సమీక్ష, ఎలాంటి శ్రద్ధ లేకుండా చేపట్టారని ఈడీ తెలిపింది. ఆ సమయంలో డిప్యూటీ సీఎంగా సిద్ధరామయ్య, ముడా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. రెవెన్యూ అధికారుల మోసపూరిత భూ మార్పిడిని కూడా నివేదిక హైలెట్ చేసింది. నిర్మాణాలు శాటిలైట్ ఇమేజుల్లో, రికార్డుల్లో పొంతన లేకుండా ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన బీఎం మల్లికార్జున స్వామి సమర్పించిన నష్టపరిహార బాండ్లో ఆయన సంతకం లేకపోవడం వల్ల పత్రాలు తారుమారు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
ఈ కేసులో సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి అక్రమంగా స్థలాల కేటాయింపు వివాదాస్పదమైంది. మార్గదర్శకాలను ఉల్లంఘించి ఆమెకు అత్యంత ఖరీదైన ప్రాంతంలో, విలువైన 14 స్థలాలను కేటాయించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, ఈడీ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత ఈ స్థలాలను తిరిగి ముడాకు అప్పగించారు. స్థల కేటాయింపుల సమయంలో ముడా ఎమ్మెల్యేగా సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర ఉన్నారు. ఈ కేసులో ఆయన ప్రమేయాన్ని కూడా ఎత్తి చూపింది. సిద్దరామయ్య సన్నిహితుడు సీటీ కుమార్ అని పిలువబడే ఎస్జీ దినేష్ కుమార్, పార్వతికి అనుకూలంగా సైట్ల కేటాయింపులలో ఫోర్జరీ, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
-
Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!