Offers Liquor to Tiger: ఎవడండి బాబు వీడు.. పెద్ద పులికే మందు తాగించుబోయాడు

  • మధ్య ప్రదేశ్ లో విచిత్ర సంఘటన
  • పెద్దపులికి మందు తాగించే ప్రయత్నించిన ఓ వ్యక్తి
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Untitled Design (15)

Untitled Design (15)

మధ్య ప్రదేశ్ లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపైకి వచ్చాడు. తనకు ఎదురుగా ఓ పెద్దపులికి మందు తాగించే ప్రయత్నం చేశాడు. కానీ అది అతడిని ఏమి అనలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Lucky Biscuit: 10 రూపాయల బిస్కెట్ ఎంత పని చేసిందో తెలుసా…

×
×
Ad

పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌కు చెందిన రాజు పటేల్ అనే వ్యక్తి పులిని ముద్దు చేసి దానికి మద్యం తాగిస్తున్నట్లు ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, అయితే ఆ సంఘటన మొత్తం నకిలీదని.. ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ద్వారా రూపొందించారని తెలిసింది. పెంచ్ నిజమైన పులుల వీక్షణలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఏ విశ్వసనీయ మీడియా సంస్థ లేదా స్థానిక అటవీ శాఖ అటువంటి సంఘటనను నివేదించలేదు. ఈ కథను కాపీ చేసి, బహుళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పదానికి పదానికి తిరిగి పంచుకున్నారు. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే రూపొందించబడినట్లు తెలుస్తోంది.

Read Also:Montha Cyclone: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ జిల్లాలోని సూళ్లకు సెలవులు

చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్లంతా ఇది నిజమైన వీడియో అని నమ్మారు. మధ్యప్రదేశ్ పెంచ్‌లో బెంగాల్ టైగర్‌కు లిక్కర్ తాగించాడు ఓ కార్మికుడు. అవును.. పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న పులిని మధ్యరాత్రి తాగిన మత్తులో ఉన్న 52ఏళ్ల కార్మికుడు రాజు పటేల్ చూశాడు. కానీ దాన్ని పిల్లి అనుకుని.. దగ్గరకు తీసుకుని లిక్కర్ తాగించబోయాడు. దాని తల నిమురుతూ పది నిమిషాలపాటు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దాన్ని అడవికి తీసుకెళ్లారని.. ఓ స్టోరీ ట్రెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం అతను పోలీసుల ప్రొటెక్షన్‌లో ఉన్నాడని.. సోషల్ మీడియా ఎకౌంట్ బ్లాక్ చేశాడని తెలుస్తోంది. కారణం పులితో ముచ్చటించిన అతను తాగిన లిక్కర్ గురించి తెలుసుకునేందుకు స్థానికులు పోటీ పడుతున్నారని.. అందుకే పోలీసుల బందోబస్తు ఉందన్న ఫన్నీ వార్త వైరల్ అవుతోంది.