Delhi : మహిళ దారుణ హత్య.. కవర్లలో శరీర భాగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ మరో దారుణ ఘటనతో ఉలిక్కి పడింది.. మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. ప్రభుత్వం ఎంతగా కఠిన చర్యలు అమలు చేస్తున్నా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. అత్యాచారాలు చెయ్యడం ఒక ఎత్తు అయితే హత్యలు చేసి ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు.. ఇటీవల ఢిల్లీలో శ్రద్దా కేసు జనాలను వణికించింది.. ఇప్పుడు అదే తరహాలో మరో కేసు వెలుగు చూసింది.. ఓ మహిళను అతి దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా చేసి కవర్లలో శరీర భాగాలను వేసిన ఘటన వెలుగు చూసింది..గీతా కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలో ఓ మహిళ మృతదేహం ముక్కలుగా పడి ఉంది. బుధవారం ఉదయం వచ్చిన సమాచారం ప్రముఖ శ్రద్దా హత్య కేసును మళ్లీ గుర్తుకు తెచ్చింది.
మృతదేహంలోని పలు ముక్కలు లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు..అవయవాలు చాలా చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. మహిళను ఇంకా గుర్తించలేదణి చెబుతున్నారు.. ఈ ఘటన వెలుగు చూసి ఒక రోజు అయ్యింది..జమున ఖాదర్ ప్రాంతంలో రెండు ముక్కలుగా నరికిన మృతదేహం లభ్యమైందని డీసీపీ నార్త్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎఫ్ఎస్ఎల్, క్రైమ్ టీమ్ దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దశలో మృతురాలి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. కొత్వాలి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. పరిసర ప్రాంతాల్లోనూ విచారణ చేస్తున్నారు. గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద మృతదేహం లభ్యమైంది. శరీర భాగాలు 2 సంచులలో కనిపించాయి. ఒకదానిలో తల, మరొక దానిలో ఇతర శరీర భాగాలు ఉన్నాయి. పొడవాటి జుట్టును బట్టి మృతదేహం మహిళది అని తెలుస్తోంది..
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
శరీరం కుళ్ళిన స్థితిలో కనిపించింది అంటే హత్య జరిగి రోజులు గడుస్తుంది..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. ఇకపోతే గతంలో కూడా అలాంటి కేసు మరొకటి వెలుగులోకి వచ్చింది. గత వారం పోలీసులు సఫ్దర్జంగ్ ఆసుపత్రి వెనుక అడవుల్లో కుళ్ళిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. మృతదేహం మహిళదేనా లేక పురుషుడిదా అనేది ఇంకా తెలియరాలేదు.. డెడ్ బాడీ పై ఉప్పు ఉండటంతో గుర్తించలేక పోయినట్లు తెలుపుతున్నారు.. మొన్న శ్రద్దా కేసు.. ఇలా వరుస హత్యలు జరగడం పై ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!