ఎట్టకేలకు విద్యార్థుల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నెలరోజులుగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలకు తలొగ్గింది. విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో జంతర్మంతర్ దగ్గర సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సీజేపీ నివాళులర్పించింది.
ఈ సందర్భంగా సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇప్పుడు న్యాయం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని.. కేంద్రానికి యువత సత్తా ఏంటో చూపించామని… ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని.. ఈ విజయం విద్యార్థులందరిది అని పేర్కొన్నారు. ఇక విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీ ఏసీపీ అజిత్ శర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రపంచం తలవంచుతోందని.. దాన్ని తలవంచేలా చేసేవారు మనకు కావాలన్నారు. ‘‘నేను అమెరికా విడిచిపెట్టినప్పుడు ఏమి జరుగుతుందోనని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. నువ్వెందుకు చేయడం లేదని ప్రతిరోజూ నన్ను అడిగేవారు. కానీ ప్రభుత్వం లొంగిపోయింది. ఇంకెంతకాలం కూర్చుంటారని అడిగారు. 36 రోజులుగా రాజీనామా ఉండదా అని నన్ను ప్రతిరోజూ అడిగారు. కానీ ప్రభుత్వం తలవంచింది. ఏమన్నారంటారా? కానీ ఒక విప్లవం జరిగింది.’’ అని అన్నారు.

