Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chirag Paswan: కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ పేరును రాజకీయ రక్షణ కోసం తప్పుడు విధంగా ఉపయోగించుకున్నారంటూ ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్పై LJP-RV పోలీసులకు ఫిర్యాదు చేసింది. భరద్వాజ్తో తమ పార్టీకి ఎలాంటి అధికారిక సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
జంతర్ మంతర్ ఘటనపై వివాదం
జూలైలో న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్పై భరద్వాజ్ దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి భరద్వాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో తాను సంజయ్ తల పగలగొట్టినట్లు చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తన చర్య ఆత్మరక్షణలో భాగమేనని భరద్వాజ్ పేర్కొన్నారు. తాను అలా స్పందించకపోతే గుంపు తనను కొట్టి చంపే అవకాశం ఉండేదని తెలిపారు. ఈ వ్యవహారంలో చిరాగ్ పాశ్వాన్, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా నుంచి సహాయం కోరినట్లు కూడా ఆయన వెల్లడించారు.
Also Read
- Vijay TVK Alliance: విజయ్ కూటమిలోకి ఎవరు..? మిత్రపక్షాల భేటీపై తమిళనాడులో పెరిగిన ఆసక్తి
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
- Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
బులంద్షహర్లో పోలీసుల అదుపులోకి
వివాదం కొనసాగుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో భరద్వాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైత్లా గ్రామం నుంచి పారిపోయి ఖుర్జా వైపు వెళ్తుండగా ఆయనను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. భరద్వాజ్ అదుపులోకి తీసుకున్న అనంతరం చిరాగ్ పాశ్వాన్ ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిషు ఆజాద్, ఆమె తండ్రికి తమ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. చట్టాన్ని ఎవరైనా పరిహాసం చేసే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు.
FIR నమోదు చేయాలని డిమాండ్
ఈ ఘటన అత్యంత తీవ్రమైనదని చిరాగ్ పాశ్వాన్ అన్నారు. ఒక వ్యక్తిని తీవ్రంగా కొట్టి అతని ప్రాణాలకు ముప్పు కలిగే స్థాయిలో దాడి చేశానని ఒక వ్యక్తి బహిరంగంగా చెప్పినప్పటికీ చర్యలు తీసుకోకపోతే దేశానికి, ప్రజలకు తప్పుడు సంకేతం వెళ్తుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భరద్వాజ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని LJP-RV డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Chirag Paswan: జంతర్ మంతర్ దాడి కేసులో ట్విస్ట్.. భరద్వాజ్పై FIRకు చిరాగ్ పాశ్వాన్ డిమాండ్
-
Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్
-
Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
-
Dollar vs UPI: డాలర్ ఆధిపత్యానికి బ్రేక్ వేయనున్న BRICS.. భారత్దే కీలక పాత్ర!
-
Explainer: 600 మంది పిల్లలు ఏమయ్యారు? హిమాలయ లోయల్లో ప్రతిధ్వనిస్తున్న కుటుంబాల ఆర్తనాదాల కథ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!