Chirag Paswan: బీహార్‌ ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన

  • రాజ్యసభకు వెళ్లిపోయిన బీహార్ సీఎం నితీష్ కుమార్
  • నితీష్ కుమార్ వారసుడిపై కూటమిలో తర్జనభర్జన
  • ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
Chiragpaswan

Chiragpaswan

బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఇటీవల పెద్దల సభ (రాజ్యసభ)కు వెళ్లిపోయారు. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. అయితే నితీష్ కుమార్ వారసుడిపై రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సామ్రాట్ చౌదరికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించవచ్చని వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా బీజేపీ ఎక్కడా ప్రకటన చేయలేదు. అయితే ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంపై తాజాగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ స్పందించారు. బీహార్ ముఖ్యమంత్రి రేసులో తాను లేనని తేల్చి చెప్పారు. అప్పుడు లేను.. ఇప్పుడు లేనని వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి ఎంపికపై మాత్రం కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. మిత్రపక్షాల సమావేశం అనంతరం అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు.

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడమే ప్రస్తుతం తన ప్రాధాన్యత అని ఇటీవల పేర్కొన్నారు. తదుపరి ముఖ్యమంత్రి బీజేపీ నుంచే ఉండాలని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని కూడా తెలిపారు.

ఇది కూడా చదవండి: Delhi: ఆ వార్తలన్నీ అబద్ధం.. హార్ముజ్ దగ్గర వసూళ్లపై ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన