కేంద్ర కేబినెట్ శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. స్కిల్ ఇండియా కార్యక్రమానికి మరో రూ.8,800 కోట్లను కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. ‘‘ఈ కార్యక్రమాలు నిర్మాణాత్మక నైపుణ్య అభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, సమాజ ఆధారిత అభ్యాసాన్ని అందించడం, అట్టడుగు వర్గాలతో సహా పట్టణ మరియు గ్రామీణ జనాభా రెండింటికీ అధిక నాణ్యత వృత్తి విద్యను పొందేలా చూడటం లక్ష్యంగా పెట్టుకున్నాయి’’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Central Cabinet Decisions: స్కిల్ ఇండియా కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం
- స్కిల్ ఇండియా కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం
- రూ.8,800 కోట్ల కేటాయింపునకు ఆమోదం