తమిళనాడులోని చెన్నైలో సంచలనం సృష్టించిన ఘటనలో మాజీ కేంద్ర మంత్రి ఎం.కే. అలగిరి కుమార్తె కయల్విజిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్ మేనేజర్పై దాడి చేసి చెంపదెబ్బ కొట్టినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వైరల్ అవుతున్న వీడియోలో కయల్విజి ఓ వ్యక్తితో కలిసి కార్యాలయంలో కూర్చొని ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్తో వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోంది. కొద్దిసేపటి వాగ్వాదం అనంతరం ఆమె ఒక్కసారిగా లేచి మేనేజర్ చెంపపై కొట్టినట్లు వీడియోలో నమోదైంది.
లిఫ్ట్ మరమ్మతుల వివాదమే కారణమా?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉన్న వాణిజ్య భవనంలో ఎస్బీఐ శాఖ అద్దెకు పనిచేస్తోంది. ఆ భవనానికి యజమాని కయల్విజి. భవనంలోని లిఫ్ట్ సరిగా పనిచేయకపోవడంతో దానిని మరమ్మతు చేయాలని బ్యాంక్ మేనేజర్ ఆమెను కోరినట్లు సమాచారం. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, ఆగ్రహానికి గురైన కయల్విజి మేనేజర్పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులకు ఫిర్యాదు
ఘటన అనంతరం ఎస్బీఐ చీఫ్ మేనేజర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. బాధిత బ్రాంచ్ మేనేజర్ ఇచ్చిన నివేదిక, సీసీటీవీ వీడియో ఆధారంగా పోలీసులు వివిధ చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్తో పాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది. ఈ సంఘటన చెన్నైలో చర్చనీయాంశంగా మారింది.
🚨 SBI Chief Manager in Chennai slapped by Former Union Minister's Daughter.
Former Union Minister MK Alagiri's daughter Kayalvizhi has slapped SBI Chief Manager. The alleged incident was captured on CCTV. The footage showed Kayalvizhi arguing with the bank manager of State… pic.twitter.com/352IQUJEjg
— Hellobanker (@Hellobanker_in) July 25, 2026

