Site icon NTV Telugu

Mark Carney: నేటి నుంచి భారత్‌లో కెనడా ప్రధాని పర్యటన.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు

Markcarney

Markcarney

కెనడా ప్రధాని మార్క్ కార్నీ తొలిసారి భారత్ పర్యటనకు వస్తున్నారు. నేటి నుంచి మార్చి 7 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఒట్టావా నుంచి ముంబైకి చేరుకోనున్నారు. ముంబై నుంచి ఆయన పర్యటన కొనసాగనుంది. ఆర్థిక సంబంధాలు బలోపేతం కోసం వ్యాపార వేత్తలతో సమావేశం కానున్నారు. మార్చి 2న ప్రధాని మోడీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇరు దేశాల సంబంధాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ, అధునాతన సాంకేతికత వంటి కీలక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించనున్నారు.

గత మాజీ ప్రధాని ట్రూడో కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తిరిగి మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. తాజాగా మార్క్ కార్నీ భారత్ పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య మరింత బలపడనున్నాయి.

Exit mobile version